12/09/2023

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం-వాస్తవాలు-వక్రీకరణలు

G. Ashok

 

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం-వాస్తవాలు-వక్రీకరణలు



తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 11 సెప్టెంబర్‌ 1946 నుండి 21 అక్టోబర్‌ 1951 వరకు ఐదు సంవత్సరాల నెల రోజుల పాటు సాగింది. సుశిక్షితులైన నిజాం సేనలకు, భారత సేనలకు, జమిందారీ ప్రయివేట్‌ సైన్యంతోపాటు రజాకార్ల సైన్యాలకు వ్యతిరేకంగా వ్యవసాయం చేసే రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు సాగించిన చారిత్రక పోరాటం. ఈ పోరాటానికి ప్రపంచ ఖ్యాతి లభించింది. పోరాట సందర్భంగా ఉనికిలోలేని పార్టీలు, నాయకులు నేడు ఈ పోరాటాన్ని వక్రీకరిస్తూ తమ పాత్రను అందులో జోడించు కుంటున్నారు. విముక్తి, విద్రోహం, విమోచన అంటూ వక్రీకరణలు చేస్తున్నారు. ముస్లింల నుండి హిందువులు విముక్తి పొందారని కొందరు, పోరాటాన్ని విరమించడం ద్వారా విద్రోహం జరిగిందని కొందరు, బంధనాల నుండి విమోచనం పొందామని కొందరు టన్నుల కొద్దీ వక్రీకరణలు చేస్తూ, ఆత్మానందం పొందుతున్నారు. వాస్తవ పోరాట వారసులను చిన్నచూపు చూస్తున్నారు.

వాస్తవంగా జరిగిందేమిటి?
230 సంవత్సరాల అసప్‌జాహిల పాలనలో నాటి తెలంగాణలోని ప్రజలు అనేక భాదలు పడ్డారు. హిందూ, ముస్లిం ప్రజలను హిందూ జమీందార్లు, ముస్లిం రాజులు, రజాకార్లు కలిసి ప్రజలపై భౌతిక దాడులు, ఆర్థిక దాడులు చేశారు. 10వ నిజాం మీర్‌ ఉస్మాన్‌ ఆలీఖాన్‌ 1911లో అధికారానికి వచ్చి 1948 సెప్టెంబర్‌ 17న రైతాంగ సాయుధ పోరాటంతో పదవీచ్యుతుడైనాడు. ఈ నిజాం కాలంలోనే మరాఠాలతో జరిగిన యుద్ధంలో అంగ్లేయుల సహకారం పొందినందుకు వారికి మచీలిపట్నం నుండి గుంటూరు వరకు గల ప్రాంతాన్ని ధారాదత్తం చేశాడు. ఆ తరువాత బ్రిటిష్‌ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని రాయలసీమ నాలుగు జిల్లాలను దత్త మండలాలుగా ఇచ్చివేశాడు. మిగిలిన 16 జిల్లాలతో నిజాం ప్రభుత్వం కొనసాగింది. ఇందులో 5 జిల్లాలు మహారాష్ట్రకు చెందినవికాగా, 3 జిల్లాలు కర్నాటకకు చెందినవి. 5.30 కోట్ల ఎకరాలలో రైతులకు 3కోట్ల ఎకరాలకు పట్టాలివ్వగా, 1.5 కోట్ల ఎకరాలు జమీందార్ల స్వాధీనంలో, 55 లక్షల ఎకరాలు నిజాం స్వంత అస్తి (సర్పెఖాస్‌)గా ఉన్నాయి. గ్రామాలలో విపరీతమైన వెట్టిచాకిరి కొనసాగింది. జమీందార్లకు తాము పండించిన పంటలతోపాటు గొర్రెలు, మేకలు, కోళ్లు, తేనె ఉచితంగా ఇచ్చేవారు. చివరికి వారి అడపిల్లలను జమీందార్ల కుటుంబాలకు ‘అడబాప’లుగా పంపించాలి. పండిన పంట మొత్తం అమ్ముకున్నప్పటికీ శిస్తులకు కావాల్సిన ఆదాయం వచ్చేది కాదు. జమీందారు భూములను, నిజాం భూములను మొదట సాగు చేసిన తరువాతనే రైతులు తమ భూములు సాగు చేసుకోవాలి. శిస్తు వసూళ్ళలలో తీవ్ర నిర్భంధం, హింస కొనసాగేది. ఈ పరిస్థితులలో ప్రజలు అనేక గ్రామాలలో తిరుగుబాట్లు చేశారు.


రష్యాలో కమ్యూనిస్టుల ప్రభుత్వం… తెలంగాణపై ప్రభావం
1914లో రష్యాలో కమ్యూనిస్టుల నాయకత్వాన ప్రభుత్వం ఏర్పడింది. దాని ప్రభావం తెలంగాణ ప్రజలపై పడింది. 40శాతం తెలుగు మాట్లాడేవాళ్ళు ఉన్నప్పటికీ ఉర్ధూ, మరాఠి మాత్రమే మాట్లాడేవారు. చదువు కోవడానికి పాఠశాలలు లేవు. శిస్తులు చెల్లించనందుకు ‘ఖారజ్‌ఖాత’ పేరుతో భూములు ప్రభుత్వానికి ఇచ్చి కూలీలుగా పనిచేసేవారు. తెలుగుభాష విస్తరణ కోసం ఆంధ్ర జన సంఘం పేరుతో కొండా వెంకట రంగారెడ్డి అధ్యక్షతన గ్రంధాలయ సంస్థను ఏర్పాటు చేశారు. వీటికి ప్రతి ఏటా కమిటీని ఎన్నుకునేవారు. వామపక్ష భావాలు కలిగిన రావి నారాయణరెడ్డి 11వ ”ఆంధ్ర జనసంఘం” వార్షికోత్సవ ఎన్నికలలో గెలిచారు. దీంతో మితవాదులు వేరే సంఘం పెట్టుకున్నారు. రావినారాయణరెడ్డి గెలిచిన తరువాత అనేకమంది సంఘంలో సభ్యులుగా చేరారు. అందులో ఆరుట్ల రామచంద్రారెడ్డి, లక్ష్మీనర్సింహారెడ్డి, కమలాదేవి, బద్దం ఎల్లారెడ్డి సంఘంలో చేరి తమ భూములను పేదలకు పంచిపెట్టారు. 1934లో తెలంగాణ పక్కనే ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో చలసాని జగన్నాదరావు, పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య, చండ్ర రాజేశ్వరరావు నాయకత్వన కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. 1936 ఏప్రిల్‌ 11న అఖిల భారత కిసాన్‌సభ ఏర్పడి ”దున్నేవానికే భూమి” నినాదాన్ని ఇచ్చింది. 1939 డిసెంబర్‌ 13న తెలంగాణలో ముగ్ధుం మొహియిద్దీన్‌, అలంకుంద్‌ మీరి, ఇబ్రహిం, ముర్తుజా హైదర్‌, రాజ్‌బహుదూర్‌ గౌర్‌ నాయకత్వన ‘కామ్రేడ్స్‌ అసోసియేషన్‌’ ఏర్పడింది. ఈ అసోసియేషన్‌ తరువాత అనేక భూ పోరాటాలు సాగాయి. అనేక గ్రామాల్లో ”సంఘం” ఏర్పడి పనిచేసింది. ప్రభుత్వ భూము లతోపాటు భూస్వాముల భూములు అక్రమించిన ప్రజలలో ముఖ్యలు ఆరు పైసలు చెల్లించి సంఘ సభ్యత్వం పొందారు. ఈ సంఘానికి భీంరెడ్డి నర్సింహారెడ్డి తదితరులు కూడా నాయకత్వం వహించారు. 1941లో పెరవల్లి వెంకటరమణయ్య కార్యదర్శిగా, ఎ.గురవారెడ్డి, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, దేవులపల్లి వెంక టేశ్వరరావు తదితరులు తెలంగాణ కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేశారు. కిసాన్‌ సభతోపాటు, ఆంధ్ర ప్రాంత కమ్యూనిస్టులు ఉద్యమానికి భౌతికంగా, ఆర్థికంగా సహకరించారు. ఈ పోరాటాన్ని అణచడానికి ఔరంగాబాద్‌కు చెందిన అడ్వకేట్‌ ఖాశీం రజ్వి నాయకత్వన 60వేల మంది కిరాయి సైనికులు, రజాకార్లు నిజాంకు తోడ్పాటు అందించారు.


ఐలమ్మ తిరుగుబాటు… దొడ్డి కొమరయ్య మరణం
జనగామ ప్రాంతంలోని పాలకుర్తి గ్రామంలో చాకలి ఐలమ్మ స్వంత భూమితోపాటు కౌలుకు భూమి తీసుకొని వరి పంట పండించింది. ఏపుగా పెరిగిన పంటను చూసిన జమీందారు విసునూరు రామచంద్రారెడ్డి పంటను ఎత్తుకెళ్ళడానికి గూండాలను పంపాడు. అప్పటికే ఆ గ్రామంలో ఉన్న భీంరెడ్డి నాయకత్వాన చల్ల ప్రతాపరెడ్డి, కె రాంచంద్రారెడ్డి, గంగుల సాయిరెడ్డి మరో 30మంది కలిసి గూండాలను తరిమివేసారు. ధాన్యం తీసుకెళ్ళకుండా అడ్డగించారు. దీనిని ఉత్సాహంగా భావించిన ప్రజలు ఊరేగింపు చేశారు. విసునూరు గ్రామ పరిసరాలలోకి రాగానే జమీందారు గుండాలు ఊరేగింపుపై కాల్పులు జరిపారు. ముందుపీఠిన ఉన్న దొడ్డి కొమురయ్య నెలకొరిగారు. ఈ మరణం పోరాటాన్ని ఉధృతంగా మలిచింది. ప్రజలు మరింత ఉద్రిక్తులై జమీందారు ఇంటిపై దాడి చేశారు. శవంతో ఊరేగింపు చేశారు. అప్పటినుండి రెండు మాసాలపాటు 300 గ్రామాలలో జమీందార్లుకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేశారు. భూములు ఆక్రమించారు. నిజాం సైన్యాన్ని, రజాకార్లను, జమీందార్ల గుండాలను తరిమితరిమి కొట్టారు. ప్రజల నిరసన తీవ్రతను గమనించి కమ్యూనిస్టు పార్టీ, 11 సెప్టెంబర్‌ 1946న ‘సాయుధ పోరాటా’నికి పిలుపునిచ్చింది. నాటినుండి పోరాటం మరింత ఉధృతమైంది. హిందూ, ముస్లిం, దళిత, గిరిజన, వెనకబడిన రైతులు కలిసి జమీందార్లకు, నిజాంకు వ్యతిరేకంగా వర్గ పోరాటం ప్రారంభించారు. పోరాటం ప్రారంభమైన 11 మాసాలకు భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. నిజాం ప్రాంతానికి మాత్రం రాలేదు. స్వాతంత్య్రం అనంతరం కూడా 13 మాసాలపాటు పోరాటం సాగుతూనే ఉంది. 1500 మంది మరణించారు. ఈ పోరాటాన్ని నిజాం అణచలేదని భావించిన కేంద్రం 1948 సెప్టెంబర్‌ 13న సైన్యాలను పోరాట కేంద్రాలకు పంపింది. సైన్యాల రాకతో నిజాం భారత ప్రభుత్వానికి లొంగిపోయి నైజాంను భారతదేశంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించాడు. సెప్టెంబర్‌ 17న భారత పతాకాన్ని హైదరాబాద్‌లోని బొల్లారంలో సైన్యాధిపతి జనరల్‌ జె.ఎన్‌. చౌదరి నాయకత్వాన ఆవిష్కరించారు. నిజాంను భారత ప్రభుత్వం ‘రాజ్‌ప్రముఖ్‌’గా ప్రకటించింది. రాజ్‌ప్రముఖ్‌ పదవికి ప్రజలు నిరసన తెలిపి నప్పటికి 1950 జనవరి 26 వరకు కొనసాగించారు. సైన్యం రాష్ట్రంలోనే ఉండి కమ్యూనిస్టులను అణిచివేయ డానికి వారిపై అత్యంత క్రూర హింసాకాండ సాగించాయి. తిరిగి జమీందార్లకు భూములు అప్పగించే ప్రయత్నం చేశాయి. ఈ పోరాటాన్ని అణిచివేయడం సాధ్యం కాదని భావించిన కేంద్ర నెహ్రూ ప్రభుత్వం, తెలంగాణలో ప్రజలు అక్రమించిన పది లక్షల ఎకరాల భూములకు ‘రక్షిత కౌలుదారీ చట్టం’ తెచ్చింది. భూముల నుండి తొలగించనని ప్రకటించింది. ఈ చట్టాన్ని సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేయడానికి కూడా వీలులేదు. ఈ చట్ట ప్రకటనతో 1951 అక్టోబర్‌ 21న ‘సాయుధ పోరాటాన్ని’ విరమిస్తూ కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది. సైన్యంతో జరిగిన పోరాటంలో రెండు వేల ఐదు వందల మంది నాయకులు మరణించారు. మొత్తం నాలుగు వేల మంది అమరులయ్యారు. మూడు వేల గ్రామాలలో గ్రామ రాజ్యాలు ఏర్పడ్డాయి.


సాయుధ పోరాటంపై వక్రభాష్యాలు
పోరాటం ప్రారంభమైనప్పటినుండీ హిందూ జమీందార్లకు, ముస్లిం నవాబుకు వ్యతిరేకంగా ముస్లింల నాయకత్వాన ఏర్పడిన కామ్రేడ్స్‌ అసోసియేషన్‌, కమ్యూనిస్టుపార్టీ, కిసాన్‌సభ నాయకత్వాన ప్రజలు ఐదు సంవత్సరాల ఒక మాసం సుదీర్ఘకాలం పోరాటం కొనసాగించారు. ఈ పోరాటంలో కుల, మతాలకు తావులేదు. రెండు పక్షాలలో హిందూ, ముస్లింలు ఉన్నారు. బందగి, షోయబుల్లా ఖాన్‌ (విలేకరి)తో సహా అనేకమంది ముస్లింలను చంపివేశారు. పోరాటంలో హిందూవులతో పాటు ముస్లింలు, మరాఠీలు కూడా పాల్గొన్నారు. అన్ని కులాలవారు ఒకే వేదికపై వచ్చి వర్గపోరాటం చేసి విజయం సాధించారు. ఈ పోరాటంలో ఒక కులం, మతం ఓటమి, మరో కులం, మతం గెలుపు అనేది లేదు. సాయుధ పోరాటం ముగిసిన 1951 అక్టోబర్‌ 21న బీజేపీ మాతృక అయిన ‘జన సంఘం’ ఏర్పడింది. ఈ పోరాటంతో జన సంఘానికి ఎలాంటి సంబంధం లేదు. 1925 సెప్టెంబర్‌ 25న ఏర్పడిన ఆర్‌ఎస్‌ఎస్‌కు కూడా పోరాటంతో సంబంధం లేదు. అలాంటివారు నేడు విముక్తి ఉత్సవాలు జరుపుతామంటూ ప్రకటించడం నిరసించదగినది. ప్రజా వర్గ పోరాటానికి మతం రంగు పులిమి అపవిత్రం చేసే ప్రయత్నాలను ఖండించాలి. పోరాటం ఫలితంగా నైజాం ప్రజల కోరిక మేరకు భారతదేశంలో విలీనమైంది. జాతీయ కాంగ్రెస్‌ కూడా నైజాం ప్రభుత్వం కొనసాగడానికే అనుకూలంగా ఉన్నట్లు చరిత్ర చెపుతున్నది. సుశిక్షితులైన సైన్యాలతో జరిగిన పోరాటంలో ప్రజలు చేసిన పోరాటం మహత్తరమైంది. నాటి పోరాట నాయకులు తమ భూములను పేదలకు పంచి నాయకత్వం వహించారు. ఈ పోరాటాన్ని వక్రీకరించడం ద్వారా బీజేపీ తన కుటిలబుద్ధిని ప్రదర్శించుకుంటుంది. భారతదేశ చరిత్రనే మార్చాలని చేసే ప్రయత్నాల్లో ఇది ఒక భాగమే. ప్రజలు దీనికి తగిన గుణపాఠం చెపుతారు.

సారంపల్లి మల్లారెడ్డి
9490098666

09/09/2023

పరస్పర బదిలీ అయిన వారి దరఖాస్తులు స్వీకరించాలి - హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

G. Ashok

 

 పరస్పర బదిలీ అయిన వారి దరఖాస్తులు స్వీకరించాలి -

 హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు



 మ్యూచువల్ గ్రౌండ్లో ట్రాన్స్ఫర్స్ కి అప్లై చేసుకున్న వారి అప్లికేషన్లు ప్రస్తుతానికి అనుమతించాలి అని పాఠశాల విద్యాశాఖ మరియు జిల్లా విద్యాధికారులు, ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ఆదేశం..ఈ కేసు విషయంలో మళ్ళీ 11/9/2023 నాడు సోమవారం వాదనలు వింటామని HIGH COURT జస్టిస్ మాధవి గారి మధ్యంతరఉత్తర్వులు...

    మ్యూచువల్ పిటిషనర్ల లాయర్లు ప్రస్తుతానికి ప్రస్తుత పరిస్థితుల్లో కోరుతుంది ఏమిటంటే వారి యొక్క ఉమ్మడి జిల్లాల ఓల్డ్ స్టేషన్ల సీనియారిటీ కాకుండా, ప్రస్తుతానికి పనిచేస్తున్న నూతన పాఠశాల యొక్క సీనియారిటీని పరిగణించి, బదిలీలు ప్రమోషన్లు పూర్తయిన తర్వాత మిగిలిపోయిన ఖాళీలలో వారికి అవకాశం ఇవ్వాలని, అప్పుడు వారికి బదిలీల అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది. ఇదే విషయాన్ని సోమవారం నాడు విచారిస్తాము..అందుకొరకే హైకోర్టు ప్రస్తుతానికి మ్యూచువల్ బదిలీల కోసం అప్లై చేసుకున్న వారి యొక్క ట్రాన్స్ఫర్ APPLICATIONS అనుమతించమని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది

    ఇక కేసు పూర్వాపరాలు చూస్తే మ్యూచువల్ బదిలీలలో వచ్చిన వారికి పాత స్టేషన్ పాయింట్లు ఇస్తూ ఈ బదిలీలలో అవకాశం కలిపించాలని లాయర్ పృథ్విరాజ్ గారు హైకోర్టులో పిటీషన్లు వేయడం జరిగింది.. అలాగే ఉమ్మడి జిల్లాలలో మ్యూచువల్ బదిలీలు జరిగిన వారికి పాత సీనియారిటీ అంటే సర్వీస్ సీనియారిటీ ఇవ్వాలి, సర్వీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని జీవో ఎంఎస్ 402 తేది. 19/2/2022 అదే చెబుతుంది. అని కోరడం జరిగింది.అయితే ఇదే జీవోను 11/4/2022 నాడు ఇచ్చిన తీర్పు WP నెంబర్ 16182 OF 2022 లో ఇచ్చిన తీర్పు ప్రకారం MUTUAL TRANSFERS SERVICE ప్రొటెక్షన్ జీవో 402 ను కొట్టివేయడం జరిగింది. దీనిని మేము పరిగణలోకి తీసుకుంటున్నామని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది..
.
    దీని ప్రకారమే మ్యూచువల్ పిటీషనర్ లాయర్ పృథ్వీరాజ్ గారు పైన తెలిపిన విధంగా మళ్ళీ కోరితే ఆ విషయాన్ని సోమవారం వాదనలు వింటామన్నారు ప్రస్తుతానికి MUTUAL TRANSFERS అప్లికేషన్లు అంగీకరించమని మాత్రమే ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

    గతంలో కోర్టు సస్పెండ్ చేసిన రద్దు చేసిన 402  సర్వీస్ ప్రొటెక్షన్ జీ ఓ ప్రకారము మ్యూచువల్ బదిలీలలో ఉమ్మడి జిల్లాలలో వచ్చినా కూడా సర్వీస్ ప్రొటెక్షన్ లేదు, ఇక ఇతర జిల్లాల మధ్య మ్యూచువల్ బదిలీ జరిగితే సర్వీస్ ప్రొటెక్షన్ ముచ్చట లేదు.. అలాగే స్పౌజ్ గ్రౌండ్లో అంతర జిల్లాల బదిలీలు జరిగిన సర్వీస్ ప్రొటెక్షన్ లేదు అని స్పష్టంగా తెలుస్తుంది.

ORDER

    In all these matters, the grievance of the petitioners is that their cases have not been considered for transfer counseling only on the ground that they have been transferred to their present respective Districts on request for mutual transfer.


    Learned counsel for the petitioners submitted that their seniority in the erstwhile Districts was to be considered vide G.O.Ms.No.402 dated 19.02.2022 and since the said G.O. was suspended by this Court vide order dated 11.04.2022 in W.P.No.16182 of 2022 and batch, the petitioners are seeking a direction to the respondents to consider their applications without considering their seniority in the erstwhile districts but only on basis of the seniority of the present place, where they are working and to be considered also only against the vacancies which are left over after the counseling is completed.


    Learned Government Pleader for Services-I seeks time to get instructions on this issue.

List these matters on 11.09.2023 in the Motion List.


    In the meanwhile, the respondents are directed to consider the applications which have been already filed by the petitioners herein


High Court Order Copy Download Here


G. Ashok. Rtd GHM. 9490300725.





06/09/2023

చరిత్ర వద్దు, పురాణాలే ముద్దు

G. Ashok

 చరిత్ర వద్దు, పురాణాలే ముద్దు
(తప్పనిసరిగా చదవాల్సిన ఒక విశ్లేషణ)

సింధూ నాగరికత

మన దేశానికి 'ఇండియా' పేరు ఈనాటిది కాదు.

ప్రపంచ చరిత్రకు సంబంధించి 'ఇండియా' Etymology ని పరిశీలిస్తే -


♦1. 'ఇండియా' పేరు Colonnial name (వలసవాదులైన పాశ్చాత్యులు, ఉదా: బ్రిటీష్) పెట్టారు) అంటున్నారు, అదెలా? ఎక్కడైనా ప్రపంచ లేదా ఇండియా చరిత్రలో వలసవాదులే మన దేశానికి 'ఇండియా' అని పేరు పెట్టారని ఉందా?

♦2. పురాణాల్లో ' భారత్ ' అని వాదిస్తున్నారు. పురాణాలు మనకు చారిత్రక పుస్తకాలా? పురాణ కథలకే చారిత్రక అంగీకారం లేదు. ఇక పురాణల్లోని పేర్లకు చరిత్ర ఉంటుందా? పురాణాల్లోని స్టోరీలను తీసుకెళ్ళి ప్రపంచ శాస్త్రీయ చరిత్రక టేబుల్ మీద పెట్టి మాట్లాడగలమా? మా పురాణాల్లో రాసివుందండి అన్జెప్పితే, నవ్విపోరా? చరిత్రకు పుక్కిటి పురాణాలకు తేడా లేదా?

♦3. క్రీ. పూ. 486 లో పర్షియా రాజైన డేరియస్ (దర్యావేషు) పలికిన మాటల్లో ఇండియా పేరు ' India' (Hindush) అని ఉందని Naksh - I - Rustam ఇరానియన్ చరిత్రకారుడు రాశాడు.

' భారత్ ' అని అప్పుడు లేదే?

♦4. క్రీ. పూ. 440 లో Herodotus అనే ప్రాచీన గ్రీకు చరిత్రకారుడు - Eastward of India అని ప్రస్తావించి మన దేశం పేరు 'ఇండియా' అని రాశాడు.

' భారత్ ' అని అప్పుడు లేదే?

♦5. క్రీ. శ. 300 లో ప్రాచీన గ్రీక్ చరిత్రకారుడు మరియు ఇండియాకు వచ్చిన యాత్రికుడు మెగస్తనేస్ మన దేశం పేరు ' ఇండియా' అనే రాశాడు గానీ, భారత్ అని రాయలేదే! అంతేకాదు, తాను మన దేశం గురించి రాసిన పుస్తకానికి ' ఇండికా ' అని పేరు పెట్టాడే గాని, 'భారత్ కా' అని పెట్టలేదే!

♦6. క్రీ.శ. 140 లో గ్రీక్ చరిత్రకారుడు మరియు ఫిలాసఫర్ Arrian రాస్తూ మన దేశం పేరు: ఇండియా ' (" The boundary of the land of India...' అని రాస్తాడు.

' భారత్ ' అని రాయలేదే?

♦7. క్రీ. శ. 590 లో ఇస్లామిక్ భౌగోళికుడు ఇస్తాఖ్రి (Istakhri) మన దేశం గురించి ప్రస్తావిస్తూ 'హింద్' అని రాశాడు (" As for the land of the Hind..."). అలాగే, మన దేశానికి ఉన్న హద్దును ' Indian Ocean ' అని రాశాడు.

ఎక్కడా భారత్ అని లేదే?

♦8. క్రీ.శ. 650 లో పదహారేళ్లు ఇండియాలో పర్యటించిన ప్రపంచ ప్రసిద్ధ యాత్రికుడు, బౌద్ధ గ్రంథాలను తర్జుమా చేసిన చైనీస్ బౌద్ధ స్కాలర్ Xuanzang మన దేశ భౌగోళికత గురించి ప్రస్తావిస్తూ 'Five Indies' అని రాశాడు.

ఎక్కడెక్కడా ' భారత్ ' అని రాయలేదే!

♦9. క్రీ. శ. 944 లో ఇస్లామిక్ వేదాంతి మరియు చరిత్రకారుడు రాస్తూ - మన దేశానికి చెందిన ఒక ప్రాంతం పేరును సింద్ మరియు సింద్ అని పేర్కొన్నాడు. 

అక్కడెక్కడా ' భారత్ ' అని లేదే?

♦10. క్రీ. శ. 1298 లో ఆసియాను సందర్శించిన ఇటలీ వర్తకుడు, ప్రపంచ యాత్రికుడు మార్కోపోలో మన దేశం గురించి -  : ఇండియా ' ("India the Greater is that which....") అని రాశాడు.

భారత్ అని రాయలేదే!

♦11. క్రీ. శ. 1328 లో రోమన్ కాథలిక్ క్విలాన్ డయాసిస్ మొట్టమొదటి ఇండియన్ బిషప్ Jordanus రాస్తూ - మన దేశం పేరు ఇండియా అని పేర్కొన్నాడు ( "What shall I say? The greatness of India is beyond description....").

భారత్ అని రాయలేదే?

♦12. క్రీ. శ. 1404 లో ఇంగ్లాండ్ హెన్రీ III రాయబారి Clavijo మన దేశం గురించి ప్రస్తావిస్తూ - ఇండియా ( " India minor....") అని రాశాడు.

భారత్ అని లేదే?

♦13. క్రీ. పూ. నుండి క్రీ. శ. వరకూ అందుబాటులో ఉన్న ప్రపంచ చారిత్రక గ్రంథాలు, చరిత్రకారులను పరిశీలిస్తే వారు మన దేశాన్ని ' ఇండియా ' అనే పిలిచారు కాని, భారత్ అని కాదే. ఆరెస్సెస్ నేత మోహన్ భగవత్ ఏ ఆధారంతో ఈ దేశం మొదట్నుండీ ' భారత్ ' అని అంటారు? చరిత్ర శాస్త్ర కొలమానానికి అందని, వలస ఆర్యులు రాసుకున్న పిట్టకథల పురాణాల్లో కురువంశం అని వారు చెప్తున్న భరతుడు (చరిత్ర లేని) అని ఒక వ్యక్తి పేరు మీద 'భారత్ ' అని మన దేశానికి పేరు పెట్టడం సబబా? చారిత్రక నామమైన ఇండియా ను తీసేసి, ఏ చారిత్రక సమ్మతీ లేని ' భారత్ ' అని మార్చడంలో ఏం శాస్త్రీయ ఔచిత్యం ఉంది? 

♦14. భరతుడు రామాయణంలో ఆర్య బ్రాహ్మణ మనువాదులు సృష్టించిన ఒక కేరక్టర్. రామాయణానికే చరిత్ర లేనప్పుడు, అందులోని పాత్రలు పాత్రధారులకు ఏం చారిత్రకత ఆపాదించగలం మనం?

♦15. ఆర్యులు వచ్చేసరికి మన దేశానికి ఉన్న పేరు ఇండియా, వలసవాదులు వచ్చేసరికి మన దేశానికి ఉన్న పేరు ఇండియా. భారత్ ఎక్కడ నుండి వచ్చింది?

♦16. అవును. మనం రాసుకున్న రాజ్యాంగంలో ' India, that is Bharat' అని ఉంటే అర్థమేంటి? అందులో ఇండియా అని ముందు ఉందా? భారత్ అని ముందుందా? ' Bharat, that is India' అని లేదు కదా? రెంటికీ తేడా లేదా? వ్యాకరణాత్మకంగా భాషాపరంగా ఈ వాక్యంలో ఏ పేరుకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది? ఇండియా కే కదా? మరి, మొదట్లో భారత్ అనే ఉండింది, బ్రిటీషోళ్లు దాన్ని ఇండియా గా మార్చారు అంటారేంటి? మన బీజేపీ నాయకులకు మతం తప్ప శాస్త్రీయ చరిత్ర తలకెక్కదా?

♦17. మన రాజ్యాగంలో మన దేశమైన ఇండియా కు అదనపు రెండవ పేరు గా 'భారత్' ను బ్రాహ్మణ భావజాలం ఉన్న సభ్యుల కారణంగా జొప్పించి ఉండొచ్చు. దాన్ని ఇంతవరకూ మనమెవరం ప్రశ్నించడం లేదు. మన దేశం పేరు ' ఇండియా ' అని ఉన్నంత కాలం, ఆ రెండవ పేరు ' భారత్ ' ను భాషావసరతను బట్టి (ఉదా. హిందీ లో మాట్లాడేటపుడు భారత్ అని రాస్తున్నాం, పలుకుతున్నాం కదా) ఉపయోగిస్తున్నాం కదా. ఇపుడు ఇప్పటికిప్పుడే ఇండియా అనే మన దేశ ప్రథమ పేరును రెండో స్థానానికి నెట్టేసి, రెండో స్థానంలో ఉన్న అదనపు పేరు భారత్ ను ముందుకు తీసుకురావడంలో బీజేపీ ఆంతర్యమేంటి? 

♦18. ఇంతకు ముందు బీజేపీ వాజ్ పేయ్ ప్రధానమంత్రిగా ఉన్న మొత్తం 6 సంవత్సరాల 80 రోజుల్లో ఏనాడూ వారికి ఇండియా పేరు అభ్యంతరం కాలేదే!

కేవలం మోడీ ప్రధానిగా ఉన్న దాదాపు ఈ పదేళ్లలోనే ఈ అభ్యంతరం ఎందుకు లేవనెత్తుతున్నారు? మోడీ ఈ పదేళ్ల కాలంలో సరిగ్గా ఇప్పుడే, వాళ్ళ పాలన ముగింపులోనే ఈ ఆలోచన వారికెందుకు వచ్చింది? ఇది రాకెట్ సైన్స్ ప్రశ్న కానేకాదు. జవాబు చాలా విస్పష్టం. బీజేపీ ప్రతివాదులు అందరూ కలిసి ఏర్పాటు చేసుకొన్న కూటమి పేరు - INDIA కాబట్టి (Indian National Developmental Inclusive Alliance). వాళ్ళు INDIA పేరును తెలివిగా హైజాక్ చేసేశారన్న నిస్సహాయతతో, ఇక చేసేదేం లేక, వీళ్ళు ఏకంగా దేశం పేరునే హైజాక్ చేసేస్తున్నారు. ఇది పొలిటికల్ పగ ప్రతీకారానికి చెందిన నిర్ణయమే గానీ, దీనికి ప్రజామోదం లేదు.

♦19. ఫిల్మ్ వెటరన్ అభిషేక్ బచ్చన్ ' భారత్ మాతా కీ జై ' అని ట్వీట్ చేస్తే అది ఆయన బీజేపీ కి పేరు మార్పుకి అనుమతి ఇచ్చేసినట్లా? ఆయనెవరు అలా చేయడానికి? అది కేవలం ఆయన అభిప్రాయం మాత్రమే. క్రికెట్ వెటరన్ సెహ్వాగ్ ఒప్పుకొంటే ఈ దేశం పేరు మార్పుకు జనాలందరూ ఒప్పేసుకొంటున్నట్లేనా? అది ఆయన ఒపీనియన్ మాత్రమే. బీజేపీ, దాని అనుబంధ చానళ్లకు వాళ్ళే దొరుకుతారా ఒపీనియన్ కోసం. మిగిలిన పార్టీల అభిప్రాయాలు, మిగిలిన మేధావుల అభిప్రాయాలు, ప్రజల అభిప్రాయాలు అవసరం లేదా? చోటా చోటా ప్రాంతీయ పార్టీలను కొనుక్కొనో, కలుపుకునో మెజారిటీ తెచ్చుకొన్నంత మాత్రాన; దేశ చరిత్రను తోసేసి, ప్రజల మనోభావాలను నొప్పించి జబర్దస్త్ గా మన చిరపరిచయ పేరు INDIA ను మార్చి రెండవ స్థాయిపేరుగా ఉన్న' భారత్ ' అని పిలవడం చాలా తీవ్రమైన నిర్ణయం అని భావించక తప్పదు.

♦20. అంతేకాదు, దేశంలో ప్రస్తుతం ఉన్న అనేక కీలక సమస్యలను విడిచిపెట్టి, ఊర్ల పేర్లు దేశం పేరు మార్చుకొంటూ పోవడం, పైగా ప్రతి విషయాన్నీ ఎక్కడో ఒకచోట సదరు పార్టీ మతంతో ముడిపెట్టి మెజారిటీ కార్డ్ ప్లే చేసుకొంటూ వెళితే గానీ నిద్రపోకపోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య అని ఇండియా ప్రజలకు ఎప్పుడో అర్ధమైపోయింది.


- మృత్యుంజయ, ఎల్. కె.

Link in English

https://www.worldhistory.org/article/203/etymology-of-the-name-india/

సనాతన ధర్మం - వాద వివాదాలు

G. Ashok

 సనాతన ధర్మం - వాద వివాదాలు


    తమిళనాడు మంత్రి, ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ "సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి" అని, ఒక సమావేశంలో చేసిన వ్యాఖ్యపై పెద్ద చర్చ జరుగుతోంది.


    'సనాతన ధర్మం అంటే, హిందూ మతం కాదు. అది ప్రాచీన కాలం నుంచీ వస్తున్న మానవ ధర్మ పరంపర!' అని కొందరు సమర్థకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఉదయనిధి తన వ్యాఖ్యల్లో ప్రధానంగా చెప్పింది "సమానత్వానికి, సామాజిక న్యాయానికి అడ్డుగా నిలుస్తున్న 'సనాతన ధర్మాన్ని' నిర్మూలించాలి" అని! దీని వెనుక నున్న ప్రధాన ఉద్దేశం "మనుషుల్ని విడదీస్తున్న, సోదరభావాన్ని చంపుతున్న, కుల రక్కసి" ని విమర్శించడమే అనీ, స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అయినా కొందరికి ఇది రుచించదు. 


    'సనాతన ధర్మమంటే.. హిందూ ధర్మం కాదు, బ్రాహ్మణ ధర్మం కాదు, మను ధర్మం కాదు, అది మానవ ధర్మం' అని చెప్పేవాళ్లు.. అదేమిటో స్పష్టంగా చెప్పగలగాలి. ఉదయనిధి వ్యాఖ్యలపై నిప్పులు చెరుగుతున్న వర్గాలు, రాజకీయ పార్టీలు, హిందూ మతాన్ని భుజానికి ఎత్తుకున్నవే అన్నది స్పష్టం. "సనాతన ధర్మం" అన్నది హైందవానికి, మనుధర్మానికి ఘనతను ఆపాదించడానికి పెట్టిన మారు పేరే తప్పా, మరోటి కాదు!


    సనాతనం అంటే స్థిరమైనది, శాశ్వత మైనది అని అర్థం. ఈ అర్థంలో చూస్తే ఏ ధర్మమూ స్థిరంగాను, శాశ్వతంగా ఉండవని ముందుగా మనం తెలుసుకోవాలి. పరిణామంలో ఉన్న ఈ విశ్వంలో ఏదీ స్థిరం కాదు. మనిషి ఏర్పాటు చేసుకున్న ధర్మాలు, అసలే స్థిరం కాదు! అవి కాలానుగుణంగానే గాక, మతాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, సంస్కృతిని బట్టి, నాగరికతను బట్టి మారిపోతుంటాయి. స్థిరమైన ధర్మాలను పాటించాలంటే, సామాజిక మార్పులన్నింటినీ గంపగుత్తగా తిరస్కరించాలి!


    సనాతనుడు అనే పదానికి పూర్వగాథాలహరి "ధర్మరాజు కొలువులోని ఒక ఋషి" అని చెబుతుంటే, శబ్ద రత్నాకరం "బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు" అని చెబుతోంది. ఇలా చూసుకున్నా.. సనాతన ధర్మమంటే, 'మనుధర్మాన్ని భుజానికి ఎత్తుకున్నదే' అని తెలుస్తుంది. సనాతన ధర్మం మంటగలసి పోతోందని, విమర్శలకు గురవుతోందని వాపోతున్నవారు.. ఈ ధర్మాలన్నీ అందులో భాగమేనని, అవి కొనసాగ వలసిందేనని కోరగలరా?


* సతీ సహగమనం, సనాతన ధర్మంలో భాగం!
* అంటరానితనం, సనాతన ధర్మంలో భాగం!
* బాల్య వివాహాలు, సనాతన ధర్మంలో భాగం!
* విధవా పునర్వివాహాల నిరోధం, సనాతన ధర్మంలో భాగం!
* దేవదాసీ, జోగినీ వ్యవస్థలు సనాతన ధర్మంలో భాగం!
* వివాహానంతరం వధువు మొదటి రాత్రి పురోహితుడితో గడపడం, సనాతన ధర్మంలో భాగం!
* స్త్రీలకు, శూద్రులకు చదువు నిషేధించడం, సనాతన ధర్మంలో భాగం!
* నేరం చేస్తే, కులాన్ని బట్టి శిక్ష విధించడం, సనాతన ధర్మంలో భాగం!
* శూద్రులు వృత్తి - ఉద్యోగాలు చెయ్యకుండా.. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సేవలందించడం, సనాతన ధర్మంలో భాగం!
* పురుషులు, కిందికులాల స్త్రీలను పెళ్లి చేసుకోవచ్చు. స్త్రీలు మాత్రం, కిందికులాల పురుషులను పెళ్లి చేసుకోకూడదు. ఇదీ సనాతన ధర్మంలో భాగమే!
మరి ఇప్పుడు ఇవన్నీ పాటిద్దామా? కాలాన్ని బట్టి మారదామా? ఆలోచించండి!


- PSR (05.09.2023)

సనాతనాన్ని కాపాడుకుందాం!!!  సనాతనమే మనకు ఆదర్శం!!! 



సనాతనం అంటే......
--------------

సనా + తనా = ఆది, అంతం లేనిది. శాశ్వతమైనది అని అర్థమట. సనాతన ధర్మం అంటే "శాశ్వతమైన మతం" లేదా "శాశ్వతమైన చట్టం" అట . మన భూమికి ఆది, అంతం రెండూ ఉన్నాయి. ఈ భూమి గ్రహంగా ఉన్న సూర్యుడికి ఆది అంతం ఉంది. ఈ విశ్వంలోని ప్రతీ నక్షత్రానికీ, వాటి గ్రహాలు, ఉపగ్రహాలాన్నిటికీ ఆది, అంతం ఉంది. కొన్నేళ్లకు మన  సూర్యుడు నశించిపోతాడు, మన భూమి పోతుంది దీనిపైన ఉన్న సమస్త జీవరాసులన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. కానీ సనాతన ధర్మం మాత్రం ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఇక్కడే (భూమి లేకపోయినా..) వేలాడుతూ వుంటుంది. మరి అది శాశ్వతం కదా ఉండితీరాలి. కాదు కూడదు అన్నవాళ్ళ తలలు ఇప్పుడే ఎగిరిపోయి వాళ్లకు  భూమి మీద నూకలు చెల్లిపోతాయి.

సనాతనం అంటే.....
-------------

ప్రాచీనమైన, అతి పురాతనమైన, ఆధునికం కానిది అని  అర్థం. నిత్య జీవితంలో మనకు ఉపయోగపడే ప్రతీ వస్తువు అత్యాధునికమైన  టెక్నాలజీతో లేటెస్ట్ మోడల్ కావాలని కోరుకుంటాము. పనికి రానిదీ పాతది వదిలేస్తాం. కానీ మన ఆలోచనలు, ఆచార వ్యవహారాలు మాత్రం బూజుపట్టి కుళ్ళు కంపుకొట్టే పాత చింతకాయ పచ్చడికంటే ఘోరంగా సనాతన పద్ధతిలోనే ఉండాలి అది ఎంత దరిద్రంగా ఉన్నా సరే. మతిలేని, స్వార్థపూరితమైన ఆ సనాతన భావాలకు తిలోదకాలు ఇచ్చి ఎవరైనా హేతుబద్ధమైన ఆధునిక భావాలవైపు మొగ్గు చూపి "సనాతన"ని ప్రశ్నించారో... వారి తలలు సొరకాయల్లా తెగిపోతాయి.

సనాతన ధర్మాన్ని ఆచరించడం అంటే....
------------------------

 అది బోధించిన చట్టాన్ని అనుసరించడమే. సనాతన ధర్మంలోని ప్రధాన చట్టం "మనుధర్మ శాస్త్రం"  ఇప్పుడున్న రాజ్యాంగాన్ని చెత్త బుట్టలో పడేసి, వర్ణ వ్యవస్థలోని శూద్ర బానిస చట్టాన్ని, కర్యేషు దాసి లాంటి స్త్రీ బానిస చట్టాన్ని తక్షణమే ప్రవేశ పెట్టాలి (దీని కోసం ప్రయత్నాలు పాపం చాలా కాలంగా సాగుతున్నాయి తొందరల్లో ఈ సనాతన చట్టం అమల్లోకి రావాలని దేవుడ్ని వేడుకుందాం) సతీ సహగమనం, అంటరానితనం, బాల్య వివాహాలు, దేవదాసీ వంటి  అనేకానేక సనాతన సదాచారాలను పునరుద్దరించి ఈ దేశ వారసత్వ సంపదను కాపాడుకోవాలి.

సనాతన ధర్మం అంటే...
-----------------

సనాతన ధర్మం అంటే వైదిక ధర్మం. అంటే వేదాల్లో చెప్పిన ధర్మం.  వేదాల్లో మెయిన్ దేవుడు ఇంద్రుడు. అగ్ని, సూర్యుడు, చంద్రుడు, వాయు దేవుడు, వరుణ దేవుడు అశ్వనీ దేవతలు వీళ్ళే దేవుళ్ళు. అంతేగానీ వేదాల్లో శివుడు, రాముడు, కృష్ణుడు, వినాయకుడు, వెంకటేశ్వరుడు, అయ్యప్ప మొదలైన కొన్ని కోట్ల మంది అస్సలు  లేరు (అప్పటికి వాళ్ళను ఇంకా మనుషులు తయారు చేయలేదు). మరి సనాతన వైదిక ధర్మంలో లేని దేవుళ్లను కొత్తగా కనిపెట్టి పూజించడం సనాతన ధర్మానికి విరుద్ధం. వేదాల్లో విగ్రహారాధన లేదు. సనాతన ధర్మం  మీద గౌరవం ఉన్న వాళ్ళు  రాముడు, కృష్ణుడు లాంటి కొత్త దేవుళ్లను,  విగ్రహాలను పూజించడం తక్షణం  మానివేయాలి.

సనాతనమే మనకు  ఆదర్శం....
------------------- 

వేదాల్లో చెప్పినట్టు ప్రతిదానికీ యజ్ఞాలు, క్రతువులు చేయాలి గుర్రాలు, ఆవులను  వేల సంఖ్యలో బలి ఇవ్వాలి. బ్రాహ్మణులు వాటిని వండుకుని తినాలి. అశ్వమేధ యాగం లాంటివి చేసి విశృంఖల శృంగారాన్ని, (గుర్రాలతో విచ్చల విడి సెక్స్ ) పబ్లిక్ గా ప్రదర్శించి సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటి చెప్పాలి.
అన్నిటికంటే ముఖ్యం  పిల్లల పాఠ్య పుస్తకాల్లో ఆధునిక చెత్త సైన్స్ పాఠాలు అన్నీ తొలగించి ఎంచక్కా మన గొప్ప వేదాలు అందరికీ అర్థం అయ్యే ఆయా భాషల్లో అర్థాలు చెబుతూ  నేర్పించాలి. మన వేదాల్లో లేనిది ఏదీ లేదు కాబట్టి వేదాలు అనుసరించే మనం మన వస్తువులు అన్నీ తయారు చేసుకోవాలి.

సనాతనం  మీద గౌరవం వుంటే...
------------------- 

సనాతనం మీద గౌరవం  ఉన్న ప్రతీ ఒక్కరం  సనాతన పద్ధతిలో తయారైన వస్తువులనే వాడుకుందాం. అలా  కాకుండా ఎవరైనా విదేశీయులు తయారు చేసిన ఏ వస్తువులు వాడినా సరే వాళ్ళను దేశ ద్రోహులుగా పరిగణించి వాళ్ళ తలలు ఎగరగొట్టి సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాం అని అందరం ప్రతిజ్ఞ చేసుకుందాం.  లేకపోతే సనాతనాన్ని నిర్మూలిస్తారా?!! ఆధునికత కావాలంటారా?!! ప్రజల్ని రాతి హృదయాలను  చేసి  కనిపించే ప్రతీ రాతిని నెత్తిన పెట్టుకునే  రాతి యుగంలో బతికేలా మేము ప్రయత్నిస్తుంటే...  "చిల్లర రాళ్ళకు మొక్కుతు వుంటే చెడిపోదువురా ఒరే ఒరే" అని నీతులు చెబుతారా!!  ఎన్ని గుండెలు!!!  

Vanaja Che

18/08/2023

సమకాలీన సమాజం లో సర్వాయి పాపన్న ప్రాసంగికత

G. Ashok

 సమకాలీన సమాజం లో సర్వాయి పాపన్న ప్రాసంగికత

( సర్వాయి పాపన్న జయంతి 18 ఆగస్ట్ సందర్భంగా) 


వీరగోని పెంటయ్య.


    చక్కని మైదాన ప్రాంతం ,సారవంతమైన నేల , గోదావరి,కృష్ణ ,తుంగభద్ర వంటి జీవ నదులు,  పచ్చని పంటపొలాలతో పరిఢ విల్లుతున్నదక్కన్ పీఠ  భూమి పైన కన్ను బడ్డ మొఘల్ చక్రవర్తి ఔరంగజీబు  క్రీ. శ. 1687 లో గోల్కొండపై దాడి చేసి,  కుతుబ్ షాహీ చివరి చక్రవర్తి అబుల్ హాసన్ అలియాస్ తానేశా ను బంధిస్తాడు. గోల్కొండ రాజ్యం 21 సుబా లు కలిగి 455 పరగణాలతో సువిశాల సామ్రాజ్యం.ఇంతటి సౌభాగ్య గడ్డను  ఔరంగజీబ్ కు నమ్మిన బంటు అయిన  జాన్ సఫార్ ఖాన్ను గోల్కొండ గవర్నర్ గా నియమించి ఆయన డిల్లీ పాలనాభారం వహించడానికి వెళ్ళిపోతాడు.

జాన్ సఫార్ ఖాన్ దక్కన్ కు కొత్తవాడు. సువిశాలమైన సుభాల వ్యవహారం అర్థం చేసుకొనే  సమయం లోనే  కక్కుర్తి పరులైన కొందరు  సుభేదార్లు  తమ సుబాలను మరింత విస్తరించుకొనే ఆపేక్షలో బడి  ఒకరి పై ఒకరు సాయధా దాడులకు పూనుకుంటారు. సైన్యం రహదారుల వెంట కవాతు చేస్తూ సుభాల సరిహద్దులను అతిక్రమిస్తుంటాయి. ఆ క్రమం లో పల్లెల్లోని బలహీన వర్గాల ప్రజల పైన ,ఆస్తుల పైన సైనిక దాడులు జరుగుతుంటాయి.ఘనపూర్ సుబాహ షాపురం గ్రామం లోని సామాన్య  గీతకార్మిక కుటుంబానికి చెందిన సర్వాయి పాపన్న కుటుంబం పైన కూడా  సైనిక దాడి జరుగుతుంది. ఇదెక్కడి అన్యాయం ఆని ప్రశ్నించిన నేరానికి పాపన్న పైనకూడ దాడి జరుగుతుంది. 


క్రీ. శ. 1650 లో పుట్టిన సర్వాయి పాపన్న వయసు ఆనాటికి 37 సంవత్సరాలు. అప్పటికే దేశ వ్యాప్తంగా జరుగుతున్న సూర్ దాస్, సంత్ రవిదాస్, మీరాబాయి, సూర్ దాస్, తులిసీ దాస్, కబీర్, రాందాస్, గురు తేజబహదూర్, గురు గోవింద్ సింగ్, గురునానక్, బసవేశ్వర్, వేమన,   లాంటి వారి  భక్తి,,  భావజాల  ఉద్యమాల , పాటల జాతరలు మండువల్లో మారుమోగుతుండిన  ఫలితంగా నాటి ధిక్కార భావజాలం పాపన్నను ప్రభావితం చేసి ఉంటుంది. 


అధికారం, ఆధిపత్యానికి కేంద్రాలు, ఆనాటి గడీల వ్యవస్థ అనీ, వాటికి వెన్నుదన్నుగా ఉన్నది గోల్కొండ రాజ్యాధికారం అనీ, ప్రౌఢ ప్రాయంలో ఉన్న పాపన్నకు సులభంగానే అర్థం అయింది. మరి తమలో ఉన్న, బానిస  దాస భావజాలానికి  మూలాలు ఎక్కడ ఆని ఆలోచించిన పుడు అవి “ కులం” లో ఉన్న విషయాన్ని అర్థం జేసుకున్నాడు. ఈ కులాల పుట్టుకకు కేంద్రం మతం అన్న విషయం ఆయన మండువల్లో విన్న బోధనలు అర్థం చేయించాయి. అందుకని కులాలను ఏకం చేయకుండా, మత సామరస్యాన్ని సాధించకుండా తమ పైన జరుగుతున్న ఆధిపత్యాన్ని అణిచివేతను ఎదుర్కోవడం సాధ్యం కాదన్న విషయం పాపన్న కు అర్థం అయింది.


అందుకే కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాండ్లు , మంగలి మాసన్న, చాకలి సరవన్న, దూదేకుల పీర్ సాహెబ్, హాసన్, హుసేన్, తురక హిమాం, కొత్వాల్ మీర్ సాహెబ్, పుర్ దిల్ ఖాన్, హనుమంతు, మేదరి ఎంకన్న, ఎరుకలి సిట్టెలు, ఏనాది పాసెలు వంటి 20,000 మంది సైనిక శక్తిని సర్వాయి పాపన్న సమకూర్చుకున్నాడు. (Source; A  social History Of Daccan. Cambridge Histories.  Cambridge University Press.) 



చాకలి, మంగలి, కుమ్మరి, బుట్టలు అల్లే వారు, దళితులు(జక్కుల) మహ్మదీయులు, దూదేకుల, ఇట్లా వివిధ కులాల మతాల వారి ఐక్య సంఘటన ద్వారా 17 వ శతాబ్దం లోనే 20,000 మంది సైన్యాన్ని కూడగట్టి ఆనాటి భారత సామ్రాజ్యవాద మొఘల్ చక్రవర్తులను గెలిచిన చరిత్ర మన కండ్ల  ముందు కనబడుతోంది. 


ఈనాడు అందరు కులాలు పోవాలి అంటున్నారు. కానీ కుల సంఘాలు బలపడాడానికి ఎవరివంతు కృషి వారు చేస్తున్నారు.  మనుషుల మధ్య ఉండవలిసిన సోదర స్వభావాన్ని కులం ధ్వంసం చేస్తుంది. అణగారిన కులాలు ఎక్కడో ఒకచోట నిత్యం అవమానాలకు గురవుతూనే ఉంటారు. మరో చోట ఏదో ఓ కులం తాము అధికులమని సంతృప్తి పొందుతూ ఉంటుంది. శారీరక శ్రమ అల్పం, బౌద్ధిక శ్రమ అధికం అనే భావజాల ఫలితమే, ఎక్కువ, తక్కువ  కులాల  లోని సారం అని పాపన్న అర్థం చేసుకున్నాడు. బుద్ధితో ఆలోచించి గురిచూసి చేతులతో బరువైన తుపాకిని ఎత్తి కాల్చితేనే దోపిడిని నిలువరించగలమని, బౌద్ధిక శ్రమ, భౌతిక శ్రమ రెండింటి మేలు కలయికనే మనిషి పురోగామికి మార్గదర్శనం ఆని పాపన్న ఆనాడే అర్థం చేసుకున్నాడు.


మతాల మధ్య విద్వేషాలు మనుషులకు కీడుచేస్తాయే కానీ మేలు చేయవని 370 ఏండ్ల కిందటనే ఆనాడు పాపన్న అర్థం చేసుకోని కులేతరులతో, మతేతరులతో సమూహం కడితే, ఇప్పుడు .మనమేమో మన మతం కానివాడితో ప్రమాదం ఆని పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నాము. మన కులం కానీ వారితో పెళ్ళిళ్ళు జరిగితే చంపివేస్తున్నాము. అన్ని రాజకీయ పార్టీలు గీతకార్మికుల ఓట్ల కోసం ఇవ్వాల సర్వాయి పాపన్నను భుజానికి ఎత్తుకుంటున్నాయి. కానీ ఆయన భావజాలాన్ని కదా ప్రచారం చేయవల్సింది. ఏమిటి ఆయన భావజాలం? ఏమిటి ఆయన తాత్వికత?  ఎక్కడైనా, ఎప్పుడైనా  బలహీనుడిని  బలవంతుడు పీడిస్తే, దోచుకొంటే అక్కడ పాపన్న ప్రత్యక్షమై బలహీనుల పక్షాన నిలబడ్డాడు. ప్రతి మనిషికి పాలకులు ఏవైతే  సౌకర్యాలు పొందుతున్నారో అవే సౌకర్యాలు  సామాన్య ప్రజలందరికీ  దక్కాలని కదా పాపన్న గడీలల్లో పోగుబడ్డ సంపదను ప్రజలకు పంచి పెట్టింది? ఇవి కదా పాపన్న గురించి మాట్లాడుకోవాల్సింది? ఆయన జన్మ దిన సందర్భంగా ఆ విలువలను ఆచరణలో పెడుతామని ప్రతి పాలక వర్గ ప్రతినిధి ప్రజలకు వాగ్దానం చేయవలసి ఉంది .  ఇవి  కదా సమకాలీన సమాజానికి సర్వాయి పాపన్న ప్రాసంగికతను తెలుపవలసిన అవసరం ఉన్న అంశాలు.


1687లో మొఘలులు ఎదుర్కొన్న సంక్షోభం నుండి బైట పడేదానికి పాడి ఆవు లాంటి దక్కన్ పై దాడి జేసీ ఇక్కడి వనరులను, ఇక్కడి ప్రజలను విపరీతంగా దోపిడి జేసిన ఫలితంగా దక్కన్ లో ఒక సర్వాయి పాపన్నను కాలం కన్నది. అలాగే ప్రపంచ యుద్ధాల కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం భారత గడ్డ పైన సాగించిన దోపిడి దౌర్జన్యాల ఫలితంగా భారంత స్వాతంత్రోద్యమం ఒక భగత్ సింగ్ ను కన్నది. 1970వ దశకంలో ఇందిరాగాంధీ విధించిన  ఎమర్జన్సీ  ప్రభావం ఫలితంగా ఏర్పడ్డ సంక్షోభం నుండి దేశంలో వేలాది ప్రజా ఉద్యమ కారులను కాలం కన్నది అందులో గద్దర్ లాంటి వారు ఎందరో. అలాగే విశాలాంధ్ర ఏర్పడ్డ  నుండి తెలంగా పైన ఎంతో దౌర్జన్యం దోపిడి జరిగినా చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిల కాలంలో అది పతాకస్థాయికి  చేరి  సర్వ విధాలా దోపిడీ, పీడనలు జరిగినందున  ఒక ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉద్భవించింది. 


1687, 1920-47, 1976-77, 1980-2014 వరకు జరిగిన కాలాన్ని గమనించి నపుడు అప్పటికంటే ఇప్పుడు అభివృద్ధి పేరిట అలివిగాని వనరుల విధ్వంసం జరుగుతున్నది. ప్రజా విస్తాపనం జరుగుతున్నది. విపరీతమైన పన్నులు వేసి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న పరిస్తితి. విద్య, వైద్యం అంగట్లో అత్యంత పిరపు సరుకులు అయినాయి.  మనుషుల మధ్యన కులాల పేరుతో మతాల పేరుతో  విద్వేషాలూ రగల్చడమే ఒక విధానంగా సాగుతున్న పరిస్థితిలో ఎందరు సర్వాయి పాపన్నలు, ఎందరు భగత్ సింగ్ లు ఎందరు గద్దర్ లు పుట్టుకు రావాల్సిన పరిస్తితి ఉంటుందో కాలమే నిర్ణయించాలి.   



వీరగోని పెంటయ్య. 

కరీంనగర్ . 9908116990






14/08/2023

Sanction of consolidated pension to the staff of Govt Polytechnics

G. Ashok


GOVERNMENT OF TELANGANA

ABSTRACT

Technical Education - Establishment- Pension -Sanction of consolidated pension to the Teachers, Librarians and Physical Directors of Government Polytechnics drawing All India Council for Technical Education Scales of Pay, 2006 who retired/ died prior to 2016- Orders-Issued



HIGHER EDUCATION (TE) DEPARTMENT

G.O.Ms.No.63                                                                                                         Dated: 11-08-2023,

 Read the following:

1. G.O.Ms.No.209, H.E (TE.I) Dept., Dated: 20-11-2010.

2. G.O.Ms.No.71, Higher Education (TE.1) Dept. Dt: 18.09.2012.

3. AICTE Gazette Notification, New Delhi, Dated: 1 March, 2019

4. G.O.Ms.No. 1, HE(UE) Department, dated:02.01.2020.

5. G.O.Ms.No.26, H.E (TE.)) Department, Dated: 30.07.2021.

6..From the Commissioner of Technical Education, Hyderabad,  Lr.No.CTE-EST1/SMP/48/2021-ESTABLISHMENT-I-CTE, dated 11.10.2021.

O R D E R:

 

In the G.O 1st read above, orders were issued for implementation of AICTE Scales of Pay, 2006 to the Teachers, Library and Physical Education Personnel working in Government Polytechnics w.e.f. 01.01.2006. In the G.O, 2nd read above, orders were issued for sanction of consolidated pension in the revised AICTE Scales of Pay, 2006 to the Teachers, Librarians and Physical Directors of Government Polytechnics.

2.         In the reference 3rd read above, the All India Council for Technical Education has issued the recommendations regarding Pay Scales, Service Conditions and Qualifications for the Teachers and other Academic Staff in Technical Institutions i.c. All India Council for Technical Education Scales of Pay, 2016 and the recommendations are applicable to all the Teaching categories working in Diploma Level Technical Institutions falling under the purview of All India Council for Technical Education.

3.         In the G.O. 5th read above, Government have issued orders for implementation of All India Council for Technical Education (AICTE)) Revised Scales of Pay, 2016 to the Teachers, Library and Physical Directors working in Government Polytechnics in the State with effect from 01.01.2016.

4.         In the reference 6th read above, the Commissioner of Technical Education, Hyderabad have stated that the Polytechnic AICTE Retired Teachers Association have requested for implementation of the AICTE 2016 Pay Scales to the Teachers, Librarians and Physical Directors of Government Polytechnics who are drawing AICTE 2006 prior to 2015 and were not in service as on 01.01.2016 as was implemented in respect of Pensioners/Family pensioners in the Universities and Colleges vide G.O. 4th read above.

5.         Government, after careful consideration of the matter, order consolidation of the pre-2016 pensions and Family pensions of Teachers, Librarians and Physical Directors of Government Polytechnics on AICTE Pay Scales who died/retired prior to 01.01.2016 as per the norms and guidelines approved in the G.O. 4th read above.

6.         The Revised consolidated pension/Family pension shall be disbursed from the month of August, 2023 i.e., the pension payable on 01.09.2023. The arrears consequent on consolidation of pension for the period from 01.01.2016 to 31.07.2023 shall be paid in four equated bi-monthly (every two months) installments starting from October, 2023.

 

7.         Government also hereby order for payment of Central Dearness Relief on the consolidated pension as detailed hereunder. The Dearness Relief shall be rounded off to the next rupee:-

 

date

% of

D.R

date

% of

D.R

01.01.2016 to 30.06.2016

0%

01.07.2019 to 31.12.2019

 

17%

 

01.07.2016 to 31.12.2016

 

2%

 

01.01.2020 to 30.06.2020

 

17%

 

01.01.2017 to 30.06.2017

 

4%

 

01.07.2020 to 31.12.2020

 

17%

 

01.07.2017 to 31.12.2017

 

5%

01.01.2020 to 30.06.2021

 

28%

 

01.01.2018 to 30.06.2018

7%

 

01.07.2021 to 31.12.2021

31%

01.07.2018 to 31.12.2018

9%

01.01.2022 to 30.06.2022

 

34%

 

01.01.2019 to 30.06.2019

 

12%

 

 

 

 

8.         The expenditure shall be debited to the concerned pension Head to which the pensions are being debited. Further, the Principal Accountant General shall adjust the expenditure on pension/family pension in terms of this order, as per the orders issued vide G.O.Ms.No. 122, Finance (Pension-1) Department, dated: 22.05.2014.

9.         This order issues with the concurrence of the Finance (HRM.V) Department, vide their U.O.No.206/212/62/A1/HRM.V/2023, Dated: 05.08.2023.

 

(BY ORDER AND IN THE NAME OF THE GOVERNOR OF TELANGANA)

 

KARUNA VAKATI

SECRETARY TO GOVERNMENT


11/08/2023

ఢిల్లీలో వేలాదిమంది ఉద్యోగుల పెన్షన్ హక్కుల మహార్యాలీ

G. Ashok

 ఢిల్లీలో వేలాదిమంది ఉద్యోగుల పెన్షన్ హక్కుల మహార్యాలీ



  • ‘పాత పెన్షన్ స్కీమ్’ పునరుద్ధరించండి…

  • ఢిల్లీలో వేలాదిమంది ఉద్యోగుల పెన్షన్ హక్కుల మహార్యాలీ

  • భారత్ బంద్ సహా ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరిక

            పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు గురువారం 10.08.2023న, రాంలీలా మైదానంలో ‘పెన్షన్ హక్కుల మహా ర్యాలీ’ ర్యాలీ నిర్వహించారు.


ఇక్కడ క్లిక్ చేసి ర్యాలీ వీడియో చూడండి. (News Click సౌజన్యంతో)

        దాదాపు 60 సంఘాల వేదికగా జాయింట్‌ ఫోరమ్‌ ఫర్‌ రిస్టోరేషన్‌ ఆఫ్‌ ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (జేఎఫ్‌ఆర్‌ఓపీఎస్‌) నిర్వహించిన నిరసన ర్యాలీ అనంతరం, ప్రస్తుత జాతీయ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పీఎస్‌)ని జనవరి 1, 2004న లేదా ఆ తర్వాత రిక్రూట్ చేయబడిన ఉద్యోగులకు అమలు చేయడం వివక్షతో కూడుకున్నదనీ, ఇది ‘‘వాడుకుని వదిలివేయడం‘‘ వంటిదనీ ప్రధాన మంత్రి గారికి మెమోరాండం సమర్పించారు.


        OPS కింద, ఉద్యోగులు చివరిగా తీసుకున్న ప్రాథమిక వేతనంలో 50% నేరుగా పెన్షన్‌గా ఇవ్వబడిందని మరియు దానిపై ద్రవ్యోల్బణం ఆధారంగా డియర్‌నెస్ అలవెన్స్‌ను చెల్లిస్తారనీ మెమోరాండం పేర్కొంది. "NPSలో, అటువంటి నిర్వచించబడిన మరియు హామీ ఇవ్వబడిన పెన్షన్ లేదు, అది నిర్వచించబడిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ మాత్రమే. ఇది పూర్తి వివక్ష మరియు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 మరియు 16ను ఉల్లంఘించడమే అన్నారు. ఎందుకంటే నియామక తేదీ ఆధారంగా, ప్రభుత్వ ఉద్యోగులను రెండు తరగతులుగా విభజించారు, ఒక సమూహం నిర్వచించబడింది మరియు 50%కి సమానమైన పెన్షన్‌ను హామీ ఇస్తుంది. వారి చివరి వేతనం ఎటువంటి సహకారం లేకుండా తీసుకోబడింది, అయితే ఇతర సమూహం తక్కువ పెన్షన్‌ను పొందుతోంది, ఇది మార్కెట్ యొక్క మార్పులపై ఆధారపడి ఉంటుంది కాబట్టి అందరికీ ”ఓపిఎస్‌ను పునరుద్ధరించడానికి జోక్యం చేసుకోవాలని మోదీని మెమోరాండం కోరింది.



‘పెన్షన్ హక్కుల మహా ర్యాలీ’లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆఫీసర్లు, ఉపాధ్యాయులు, మాజీ పారా మిలటరీ ఉద్యోగులు, పెన్షనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంలీలా మైదానంలో ఎన్.జె.సి.ఏ కన్వీనర్ శివగోపాల్ మిశ్రా అధ్యక్షతన బహిరంగసభ జరిపారు. జాయింట్ ఫోరం ఫర్ రెస్టోరేషన్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (జేఎఫ్ఆర్ఓపీఎస్) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరిగిన ప్రదర్శనలు, ర్యాలీలలో లక్షలాది మంది రైల్వే, డిఫెన్స్, పోస్టల్, ఇన్కమ్ టాక్స్ తదితర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆఫీసర్లు, రాష్ట్ర ప్రభుత్వ, స్వయంప్రతిపత్త సంస్థల ఉద్యోగులు, టీచర్లు, యూనివర్సిటీల సిబ్బంది, పెన్షనర్లు పాల్గొని న్యూ పెన్షన్ స్కీము(సిపియస్)ను రద్దు చేయాలని నినదించారు. ఎన్పీఎస్ కారణంగా ఉద్యోగుల భవిష్యత్తు అనిశ్చితంగా మారినందు వల్ల ఓపీఎస్‌ ను పునరుద్ధరించమనడం న్యాయబద్ధమైన కోర్కె తెలంగాణ ఆల్ పెన్షనర్స్ మరియు రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం అశోక్ ఈ సందర్భంగా తెలిపారు.


        సి.ఆర్.పి.ఎఫ్, సి.ఐ.ఎస్.ఎఫ్, ఐ.టి.బి.పి, యస్.యస్.బి, ఎన్.ఎస్.జి, అస్సాం రైఫిల్స్, తదితర సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సి.ఎ.పి.ఎఫ్ లు) సిబ్బంది అందరూ పాత పెన్షన్‌ స్కీముకు అర్హులని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వారికి కూడా ఓపీఎస్‌ అమలు చేయడానికి తిరస్కరించటం శోచనీయమని పేర్కొన్నారు. ఎన్.పీ.ఎస్ కు అనుకూలంగా కొద్దిమంది ఆర్థికవేత్తలు చేస్తున్న వాదనలు పూర్తిగా అసంబద్ధమన్నారు. అనేక దేశాల్లో పెన్షన్ నిధులు కుప్పకూలాయని, పెన్షనర్లు నష్టపోయారని, భారతదేశంలో కూడా ఎన్.పీ.ఎస్ మార్కెట్‌పై ఆధారపడి ఉంటుందని, షేర్ మార్కెట్ పతనమైతే పెన్షన్ ఫండ్ దివాళా తీస్తుందని గడ్డం అశోక్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రజాసంపదను కార్పొరేట్లకు దోచి పెడుతూ, సామాజిక రంగానికి, వృద్ధాప్య భద్రతపై కోతలు విధిస్తున్నదని, పెన్షన్ ఫండ్లను ప్రైవేటీకరిస్తున్నదని తెలిపారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించినట్లుగా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నో పెన్షన్ స్కీమును (ఎన్.పీ.ఎస్) రద్దు చేసి ఓ.పి.ఎస్ ను అమలు పరచాలని కోరారు. పాత పెన్షన్ విధానం ఉద్యోగులకే కాకుండా దేశానికి కూడా చాలా ఉపయోగకరమన్నారు. ఎన్. పీ.ఎస్ పై కేంద్రం వేసిన కమిటీపై భ్రమలు అవసరం లేదని, వృద్ధాప్య భద్రతను కాపాడేందుకు, దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఇతర సమస్యల పరిష్కారానికై ఐక్యంగా భారత్ బంద్ తో సహా ఆందోళనలను వెంటనే తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా గడ్డం అశోక్ హెచ్చరించారు.


గడ్డం అశోక్

9490300725