ఢిల్లీలో వేలాదిమంది ఉద్యోగుల పెన్షన్ హక్కుల మహార్యాలీ
‘పాత పెన్షన్ స్కీమ్’ పునరుద్ధరించండి…
ఢిల్లీలో వేలాదిమంది ఉద్యోగుల పెన్షన్ హక్కుల మహార్యాలీ
భారత్ బంద్ సహా ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరిక
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు గురువారం 10.08.2023న, రాంలీలా మైదానంలో ‘పెన్షన్ హక్కుల మహా ర్యాలీ’ ర్యాలీ నిర్వహించారు.
ఇక్కడ క్లిక్ చేసి ర్యాలీ వీడియో చూడండి. (News Click సౌజన్యంతో)
దాదాపు 60 సంఘాల వేదికగా జాయింట్ ఫోరమ్ ఫర్ రిస్టోరేషన్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (జేఎఫ్ఆర్ఓపీఎస్) నిర్వహించిన నిరసన ర్యాలీ అనంతరం, ప్రస్తుత జాతీయ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్)ని జనవరి 1, 2004న లేదా ఆ తర్వాత రిక్రూట్ చేయబడిన ఉద్యోగులకు అమలు చేయడం వివక్షతో కూడుకున్నదనీ, ఇది ‘‘వాడుకుని వదిలివేయడం‘‘ వంటిదనీ ప్రధాన మంత్రి గారికి మెమోరాండం సమర్పించారు.
OPS కింద, ఉద్యోగులు చివరిగా తీసుకున్న ప్రాథమిక వేతనంలో 50% నేరుగా పెన్షన్గా ఇవ్వబడిందని మరియు దానిపై ద్రవ్యోల్బణం ఆధారంగా డియర్నెస్ అలవెన్స్ను చెల్లిస్తారనీ మెమోరాండం పేర్కొంది. "NPSలో, అటువంటి నిర్వచించబడిన మరియు హామీ ఇవ్వబడిన పెన్షన్ లేదు, అది నిర్వచించబడిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ మాత్రమే. ఇది పూర్తి వివక్ష మరియు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 మరియు 16ను ఉల్లంఘించడమే అన్నారు. ఎందుకంటే నియామక తేదీ ఆధారంగా, ప్రభుత్వ ఉద్యోగులను రెండు తరగతులుగా విభజించారు, ఒక సమూహం నిర్వచించబడింది మరియు 50%కి సమానమైన పెన్షన్ను హామీ ఇస్తుంది. వారి చివరి వేతనం ఎటువంటి సహకారం లేకుండా తీసుకోబడింది, అయితే ఇతర సమూహం తక్కువ పెన్షన్ను పొందుతోంది, ఇది మార్కెట్ యొక్క మార్పులపై ఆధారపడి ఉంటుంది కాబట్టి అందరికీ ”ఓపిఎస్ను పునరుద్ధరించడానికి జోక్యం చేసుకోవాలని మోదీని మెమోరాండం కోరింది.
‘పెన్షన్ హక్కుల మహా ర్యాలీ’లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆఫీసర్లు, ఉపాధ్యాయులు, మాజీ పారా మిలటరీ ఉద్యోగులు, పెన్షనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంలీలా మైదానంలో ఎన్.జె.సి.ఏ కన్వీనర్ శివగోపాల్ మిశ్రా అధ్యక్షతన బహిరంగసభ జరిపారు. జాయింట్ ఫోరం ఫర్ రెస్టోరేషన్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (జేఎఫ్ఆర్ఓపీఎస్) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరిగిన ప్రదర్శనలు, ర్యాలీలలో లక్షలాది మంది రైల్వే, డిఫెన్స్, పోస్టల్, ఇన్కమ్ టాక్స్ తదితర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆఫీసర్లు, రాష్ట్ర ప్రభుత్వ, స్వయంప్రతిపత్త సంస్థల ఉద్యోగులు, టీచర్లు, యూనివర్సిటీల సిబ్బంది, పెన్షనర్లు పాల్గొని న్యూ పెన్షన్ స్కీము(సిపియస్)ను రద్దు చేయాలని నినదించారు. ఎన్పీఎస్ కారణంగా ఉద్యోగుల భవిష్యత్తు అనిశ్చితంగా మారినందు వల్ల ఓపీఎస్ ను పునరుద్ధరించమనడం న్యాయబద్ధమైన కోర్కె తెలంగాణ ఆల్ పెన్షనర్స్ మరియు రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం అశోక్ ఈ సందర్భంగా తెలిపారు.
సి.ఆర్.పి.ఎఫ్, సి.ఐ.ఎస్.ఎఫ్, ఐ.టి.బి.పి, యస్.యస్.బి, ఎన్.ఎస్.జి, అస్సాం రైఫిల్స్, తదితర సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సి.ఎ.పి.ఎఫ్ లు) సిబ్బంది అందరూ పాత పెన్షన్ స్కీముకు అర్హులని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వారికి కూడా ఓపీఎస్ అమలు చేయడానికి తిరస్కరించటం శోచనీయమని పేర్కొన్నారు. ఎన్.పీ.ఎస్ కు అనుకూలంగా కొద్దిమంది ఆర్థికవేత్తలు చేస్తున్న వాదనలు పూర్తిగా అసంబద్ధమన్నారు. అనేక దేశాల్లో పెన్షన్ నిధులు కుప్పకూలాయని, పెన్షనర్లు నష్టపోయారని, భారతదేశంలో కూడా ఎన్.పీ.ఎస్ మార్కెట్పై ఆధారపడి ఉంటుందని, షేర్ మార్కెట్ పతనమైతే పెన్షన్ ఫండ్ దివాళా తీస్తుందని గడ్డం అశోక్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రజాసంపదను కార్పొరేట్లకు దోచి పెడుతూ, సామాజిక రంగానికి, వృద్ధాప్య భద్రతపై కోతలు విధిస్తున్నదని, పెన్షన్ ఫండ్లను ప్రైవేటీకరిస్తున్నదని తెలిపారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించినట్లుగా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నో పెన్షన్ స్కీమును (ఎన్.పీ.ఎస్) రద్దు చేసి ఓ.పి.ఎస్ ను అమలు పరచాలని కోరారు. పాత పెన్షన్ విధానం ఉద్యోగులకే కాకుండా దేశానికి కూడా చాలా ఉపయోగకరమన్నారు. ఎన్. పీ.ఎస్ పై కేంద్రం వేసిన కమిటీపై భ్రమలు అవసరం లేదని, వృద్ధాప్య భద్రతను కాపాడేందుకు, దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఇతర సమస్యల పరిష్కారానికై ఐక్యంగా భారత్ బంద్ తో సహా ఆందోళనలను వెంటనే తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా గడ్డం అశోక్ హెచ్చరించారు.
గడ్డం అశోక్
9490300725
0 కామెంట్లు:
కామెంట్ను పోస్ట్ చేయండి