18/08/2023

సమకాలీన సమాజం లో సర్వాయి పాపన్న ప్రాసంగికత

G. Ashok

 సమకాలీన సమాజం లో సర్వాయి పాపన్న ప్రాసంగికత

( సర్వాయి పాపన్న జయంతి 18 ఆగస్ట్ సందర్భంగా) 


వీరగోని పెంటయ్య.


    చక్కని మైదాన ప్రాంతం ,సారవంతమైన నేల , గోదావరి,కృష్ణ ,తుంగభద్ర వంటి జీవ నదులు,  పచ్చని పంటపొలాలతో పరిఢ విల్లుతున్నదక్కన్ పీఠ  భూమి పైన కన్ను బడ్డ మొఘల్ చక్రవర్తి ఔరంగజీబు  క్రీ. శ. 1687 లో గోల్కొండపై దాడి చేసి,  కుతుబ్ షాహీ చివరి చక్రవర్తి అబుల్ హాసన్ అలియాస్ తానేశా ను బంధిస్తాడు. గోల్కొండ రాజ్యం 21 సుబా లు కలిగి 455 పరగణాలతో సువిశాల సామ్రాజ్యం.ఇంతటి సౌభాగ్య గడ్డను  ఔరంగజీబ్ కు నమ్మిన బంటు అయిన  జాన్ సఫార్ ఖాన్ను గోల్కొండ గవర్నర్ గా నియమించి ఆయన డిల్లీ పాలనాభారం వహించడానికి వెళ్ళిపోతాడు.

జాన్ సఫార్ ఖాన్ దక్కన్ కు కొత్తవాడు. సువిశాలమైన సుభాల వ్యవహారం అర్థం చేసుకొనే  సమయం లోనే  కక్కుర్తి పరులైన కొందరు  సుభేదార్లు  తమ సుబాలను మరింత విస్తరించుకొనే ఆపేక్షలో బడి  ఒకరి పై ఒకరు సాయధా దాడులకు పూనుకుంటారు. సైన్యం రహదారుల వెంట కవాతు చేస్తూ సుభాల సరిహద్దులను అతిక్రమిస్తుంటాయి. ఆ క్రమం లో పల్లెల్లోని బలహీన వర్గాల ప్రజల పైన ,ఆస్తుల పైన సైనిక దాడులు జరుగుతుంటాయి.ఘనపూర్ సుబాహ షాపురం గ్రామం లోని సామాన్య  గీతకార్మిక కుటుంబానికి చెందిన సర్వాయి పాపన్న కుటుంబం పైన కూడా  సైనిక దాడి జరుగుతుంది. ఇదెక్కడి అన్యాయం ఆని ప్రశ్నించిన నేరానికి పాపన్న పైనకూడ దాడి జరుగుతుంది. 


క్రీ. శ. 1650 లో పుట్టిన సర్వాయి పాపన్న వయసు ఆనాటికి 37 సంవత్సరాలు. అప్పటికే దేశ వ్యాప్తంగా జరుగుతున్న సూర్ దాస్, సంత్ రవిదాస్, మీరాబాయి, సూర్ దాస్, తులిసీ దాస్, కబీర్, రాందాస్, గురు తేజబహదూర్, గురు గోవింద్ సింగ్, గురునానక్, బసవేశ్వర్, వేమన,   లాంటి వారి  భక్తి,,  భావజాల  ఉద్యమాల , పాటల జాతరలు మండువల్లో మారుమోగుతుండిన  ఫలితంగా నాటి ధిక్కార భావజాలం పాపన్నను ప్రభావితం చేసి ఉంటుంది. 


అధికారం, ఆధిపత్యానికి కేంద్రాలు, ఆనాటి గడీల వ్యవస్థ అనీ, వాటికి వెన్నుదన్నుగా ఉన్నది గోల్కొండ రాజ్యాధికారం అనీ, ప్రౌఢ ప్రాయంలో ఉన్న పాపన్నకు సులభంగానే అర్థం అయింది. మరి తమలో ఉన్న, బానిస  దాస భావజాలానికి  మూలాలు ఎక్కడ ఆని ఆలోచించిన పుడు అవి “ కులం” లో ఉన్న విషయాన్ని అర్థం జేసుకున్నాడు. ఈ కులాల పుట్టుకకు కేంద్రం మతం అన్న విషయం ఆయన మండువల్లో విన్న బోధనలు అర్థం చేయించాయి. అందుకని కులాలను ఏకం చేయకుండా, మత సామరస్యాన్ని సాధించకుండా తమ పైన జరుగుతున్న ఆధిపత్యాన్ని అణిచివేతను ఎదుర్కోవడం సాధ్యం కాదన్న విషయం పాపన్న కు అర్థం అయింది.


అందుకే కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాండ్లు , మంగలి మాసన్న, చాకలి సరవన్న, దూదేకుల పీర్ సాహెబ్, హాసన్, హుసేన్, తురక హిమాం, కొత్వాల్ మీర్ సాహెబ్, పుర్ దిల్ ఖాన్, హనుమంతు, మేదరి ఎంకన్న, ఎరుకలి సిట్టెలు, ఏనాది పాసెలు వంటి 20,000 మంది సైనిక శక్తిని సర్వాయి పాపన్న సమకూర్చుకున్నాడు. (Source; A  social History Of Daccan. Cambridge Histories.  Cambridge University Press.) 



చాకలి, మంగలి, కుమ్మరి, బుట్టలు అల్లే వారు, దళితులు(జక్కుల) మహ్మదీయులు, దూదేకుల, ఇట్లా వివిధ కులాల మతాల వారి ఐక్య సంఘటన ద్వారా 17 వ శతాబ్దం లోనే 20,000 మంది సైన్యాన్ని కూడగట్టి ఆనాటి భారత సామ్రాజ్యవాద మొఘల్ చక్రవర్తులను గెలిచిన చరిత్ర మన కండ్ల  ముందు కనబడుతోంది. 


ఈనాడు అందరు కులాలు పోవాలి అంటున్నారు. కానీ కుల సంఘాలు బలపడాడానికి ఎవరివంతు కృషి వారు చేస్తున్నారు.  మనుషుల మధ్య ఉండవలిసిన సోదర స్వభావాన్ని కులం ధ్వంసం చేస్తుంది. అణగారిన కులాలు ఎక్కడో ఒకచోట నిత్యం అవమానాలకు గురవుతూనే ఉంటారు. మరో చోట ఏదో ఓ కులం తాము అధికులమని సంతృప్తి పొందుతూ ఉంటుంది. శారీరక శ్రమ అల్పం, బౌద్ధిక శ్రమ అధికం అనే భావజాల ఫలితమే, ఎక్కువ, తక్కువ  కులాల  లోని సారం అని పాపన్న అర్థం చేసుకున్నాడు. బుద్ధితో ఆలోచించి గురిచూసి చేతులతో బరువైన తుపాకిని ఎత్తి కాల్చితేనే దోపిడిని నిలువరించగలమని, బౌద్ధిక శ్రమ, భౌతిక శ్రమ రెండింటి మేలు కలయికనే మనిషి పురోగామికి మార్గదర్శనం ఆని పాపన్న ఆనాడే అర్థం చేసుకున్నాడు.


మతాల మధ్య విద్వేషాలు మనుషులకు కీడుచేస్తాయే కానీ మేలు చేయవని 370 ఏండ్ల కిందటనే ఆనాడు పాపన్న అర్థం చేసుకోని కులేతరులతో, మతేతరులతో సమూహం కడితే, ఇప్పుడు .మనమేమో మన మతం కానివాడితో ప్రమాదం ఆని పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నాము. మన కులం కానీ వారితో పెళ్ళిళ్ళు జరిగితే చంపివేస్తున్నాము. అన్ని రాజకీయ పార్టీలు గీతకార్మికుల ఓట్ల కోసం ఇవ్వాల సర్వాయి పాపన్నను భుజానికి ఎత్తుకుంటున్నాయి. కానీ ఆయన భావజాలాన్ని కదా ప్రచారం చేయవల్సింది. ఏమిటి ఆయన భావజాలం? ఏమిటి ఆయన తాత్వికత?  ఎక్కడైనా, ఎప్పుడైనా  బలహీనుడిని  బలవంతుడు పీడిస్తే, దోచుకొంటే అక్కడ పాపన్న ప్రత్యక్షమై బలహీనుల పక్షాన నిలబడ్డాడు. ప్రతి మనిషికి పాలకులు ఏవైతే  సౌకర్యాలు పొందుతున్నారో అవే సౌకర్యాలు  సామాన్య ప్రజలందరికీ  దక్కాలని కదా పాపన్న గడీలల్లో పోగుబడ్డ సంపదను ప్రజలకు పంచి పెట్టింది? ఇవి కదా పాపన్న గురించి మాట్లాడుకోవాల్సింది? ఆయన జన్మ దిన సందర్భంగా ఆ విలువలను ఆచరణలో పెడుతామని ప్రతి పాలక వర్గ ప్రతినిధి ప్రజలకు వాగ్దానం చేయవలసి ఉంది .  ఇవి  కదా సమకాలీన సమాజానికి సర్వాయి పాపన్న ప్రాసంగికతను తెలుపవలసిన అవసరం ఉన్న అంశాలు.


1687లో మొఘలులు ఎదుర్కొన్న సంక్షోభం నుండి బైట పడేదానికి పాడి ఆవు లాంటి దక్కన్ పై దాడి జేసీ ఇక్కడి వనరులను, ఇక్కడి ప్రజలను విపరీతంగా దోపిడి జేసిన ఫలితంగా దక్కన్ లో ఒక సర్వాయి పాపన్నను కాలం కన్నది. అలాగే ప్రపంచ యుద్ధాల కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం భారత గడ్డ పైన సాగించిన దోపిడి దౌర్జన్యాల ఫలితంగా భారంత స్వాతంత్రోద్యమం ఒక భగత్ సింగ్ ను కన్నది. 1970వ దశకంలో ఇందిరాగాంధీ విధించిన  ఎమర్జన్సీ  ప్రభావం ఫలితంగా ఏర్పడ్డ సంక్షోభం నుండి దేశంలో వేలాది ప్రజా ఉద్యమ కారులను కాలం కన్నది అందులో గద్దర్ లాంటి వారు ఎందరో. అలాగే విశాలాంధ్ర ఏర్పడ్డ  నుండి తెలంగా పైన ఎంతో దౌర్జన్యం దోపిడి జరిగినా చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిల కాలంలో అది పతాకస్థాయికి  చేరి  సర్వ విధాలా దోపిడీ, పీడనలు జరిగినందున  ఒక ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉద్భవించింది. 


1687, 1920-47, 1976-77, 1980-2014 వరకు జరిగిన కాలాన్ని గమనించి నపుడు అప్పటికంటే ఇప్పుడు అభివృద్ధి పేరిట అలివిగాని వనరుల విధ్వంసం జరుగుతున్నది. ప్రజా విస్తాపనం జరుగుతున్నది. విపరీతమైన పన్నులు వేసి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న పరిస్తితి. విద్య, వైద్యం అంగట్లో అత్యంత పిరపు సరుకులు అయినాయి.  మనుషుల మధ్యన కులాల పేరుతో మతాల పేరుతో  విద్వేషాలూ రగల్చడమే ఒక విధానంగా సాగుతున్న పరిస్థితిలో ఎందరు సర్వాయి పాపన్నలు, ఎందరు భగత్ సింగ్ లు ఎందరు గద్దర్ లు పుట్టుకు రావాల్సిన పరిస్తితి ఉంటుందో కాలమే నిర్ణయించాలి.   



వీరగోని పెంటయ్య. 

కరీంనగర్ . 9908116990






14/08/2023

Sanction of consolidated pension to the staff of Govt Polytechnics

G. Ashok


GOVERNMENT OF TELANGANA

ABSTRACT

Technical Education - Establishment- Pension -Sanction of consolidated pension to the Teachers, Librarians and Physical Directors of Government Polytechnics drawing All India Council for Technical Education Scales of Pay, 2006 who retired/ died prior to 2016- Orders-Issued



HIGHER EDUCATION (TE) DEPARTMENT

G.O.Ms.No.63                                                                                                         Dated: 11-08-2023,

 Read the following:

1. G.O.Ms.No.209, H.E (TE.I) Dept., Dated: 20-11-2010.

2. G.O.Ms.No.71, Higher Education (TE.1) Dept. Dt: 18.09.2012.

3. AICTE Gazette Notification, New Delhi, Dated: 1 March, 2019

4. G.O.Ms.No. 1, HE(UE) Department, dated:02.01.2020.

5. G.O.Ms.No.26, H.E (TE.)) Department, Dated: 30.07.2021.

6..From the Commissioner of Technical Education, Hyderabad,  Lr.No.CTE-EST1/SMP/48/2021-ESTABLISHMENT-I-CTE, dated 11.10.2021.

O R D E R:

 

In the G.O 1st read above, orders were issued for implementation of AICTE Scales of Pay, 2006 to the Teachers, Library and Physical Education Personnel working in Government Polytechnics w.e.f. 01.01.2006. In the G.O, 2nd read above, orders were issued for sanction of consolidated pension in the revised AICTE Scales of Pay, 2006 to the Teachers, Librarians and Physical Directors of Government Polytechnics.

2.         In the reference 3rd read above, the All India Council for Technical Education has issued the recommendations regarding Pay Scales, Service Conditions and Qualifications for the Teachers and other Academic Staff in Technical Institutions i.c. All India Council for Technical Education Scales of Pay, 2016 and the recommendations are applicable to all the Teaching categories working in Diploma Level Technical Institutions falling under the purview of All India Council for Technical Education.

3.         In the G.O. 5th read above, Government have issued orders for implementation of All India Council for Technical Education (AICTE)) Revised Scales of Pay, 2016 to the Teachers, Library and Physical Directors working in Government Polytechnics in the State with effect from 01.01.2016.

4.         In the reference 6th read above, the Commissioner of Technical Education, Hyderabad have stated that the Polytechnic AICTE Retired Teachers Association have requested for implementation of the AICTE 2016 Pay Scales to the Teachers, Librarians and Physical Directors of Government Polytechnics who are drawing AICTE 2006 prior to 2015 and were not in service as on 01.01.2016 as was implemented in respect of Pensioners/Family pensioners in the Universities and Colleges vide G.O. 4th read above.

5.         Government, after careful consideration of the matter, order consolidation of the pre-2016 pensions and Family pensions of Teachers, Librarians and Physical Directors of Government Polytechnics on AICTE Pay Scales who died/retired prior to 01.01.2016 as per the norms and guidelines approved in the G.O. 4th read above.

6.         The Revised consolidated pension/Family pension shall be disbursed from the month of August, 2023 i.e., the pension payable on 01.09.2023. The arrears consequent on consolidation of pension for the period from 01.01.2016 to 31.07.2023 shall be paid in four equated bi-monthly (every two months) installments starting from October, 2023.

 

7.         Government also hereby order for payment of Central Dearness Relief on the consolidated pension as detailed hereunder. The Dearness Relief shall be rounded off to the next rupee:-

 

date

% of

D.R

date

% of

D.R

01.01.2016 to 30.06.2016

0%

01.07.2019 to 31.12.2019

 

17%

 

01.07.2016 to 31.12.2016

 

2%

 

01.01.2020 to 30.06.2020

 

17%

 

01.01.2017 to 30.06.2017

 

4%

 

01.07.2020 to 31.12.2020

 

17%

 

01.07.2017 to 31.12.2017

 

5%

01.01.2020 to 30.06.2021

 

28%

 

01.01.2018 to 30.06.2018

7%

 

01.07.2021 to 31.12.2021

31%

01.07.2018 to 31.12.2018

9%

01.01.2022 to 30.06.2022

 

34%

 

01.01.2019 to 30.06.2019

 

12%

 

 

 

 

8.         The expenditure shall be debited to the concerned pension Head to which the pensions are being debited. Further, the Principal Accountant General shall adjust the expenditure on pension/family pension in terms of this order, as per the orders issued vide G.O.Ms.No. 122, Finance (Pension-1) Department, dated: 22.05.2014.

9.         This order issues with the concurrence of the Finance (HRM.V) Department, vide their U.O.No.206/212/62/A1/HRM.V/2023, Dated: 05.08.2023.

 

(BY ORDER AND IN THE NAME OF THE GOVERNOR OF TELANGANA)

 

KARUNA VAKATI

SECRETARY TO GOVERNMENT


11/08/2023

ఢిల్లీలో వేలాదిమంది ఉద్యోగుల పెన్షన్ హక్కుల మహార్యాలీ

G. Ashok

 ఢిల్లీలో వేలాదిమంది ఉద్యోగుల పెన్షన్ హక్కుల మహార్యాలీ



  • ‘పాత పెన్షన్ స్కీమ్’ పునరుద్ధరించండి…

  • ఢిల్లీలో వేలాదిమంది ఉద్యోగుల పెన్షన్ హక్కుల మహార్యాలీ

  • భారత్ బంద్ సహా ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరిక

            పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు గురువారం 10.08.2023న, రాంలీలా మైదానంలో ‘పెన్షన్ హక్కుల మహా ర్యాలీ’ ర్యాలీ నిర్వహించారు.


ఇక్కడ క్లిక్ చేసి ర్యాలీ వీడియో చూడండి. (News Click సౌజన్యంతో)

        దాదాపు 60 సంఘాల వేదికగా జాయింట్‌ ఫోరమ్‌ ఫర్‌ రిస్టోరేషన్‌ ఆఫ్‌ ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (జేఎఫ్‌ఆర్‌ఓపీఎస్‌) నిర్వహించిన నిరసన ర్యాలీ అనంతరం, ప్రస్తుత జాతీయ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పీఎస్‌)ని జనవరి 1, 2004న లేదా ఆ తర్వాత రిక్రూట్ చేయబడిన ఉద్యోగులకు అమలు చేయడం వివక్షతో కూడుకున్నదనీ, ఇది ‘‘వాడుకుని వదిలివేయడం‘‘ వంటిదనీ ప్రధాన మంత్రి గారికి మెమోరాండం సమర్పించారు.


        OPS కింద, ఉద్యోగులు చివరిగా తీసుకున్న ప్రాథమిక వేతనంలో 50% నేరుగా పెన్షన్‌గా ఇవ్వబడిందని మరియు దానిపై ద్రవ్యోల్బణం ఆధారంగా డియర్‌నెస్ అలవెన్స్‌ను చెల్లిస్తారనీ మెమోరాండం పేర్కొంది. "NPSలో, అటువంటి నిర్వచించబడిన మరియు హామీ ఇవ్వబడిన పెన్షన్ లేదు, అది నిర్వచించబడిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ మాత్రమే. ఇది పూర్తి వివక్ష మరియు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 మరియు 16ను ఉల్లంఘించడమే అన్నారు. ఎందుకంటే నియామక తేదీ ఆధారంగా, ప్రభుత్వ ఉద్యోగులను రెండు తరగతులుగా విభజించారు, ఒక సమూహం నిర్వచించబడింది మరియు 50%కి సమానమైన పెన్షన్‌ను హామీ ఇస్తుంది. వారి చివరి వేతనం ఎటువంటి సహకారం లేకుండా తీసుకోబడింది, అయితే ఇతర సమూహం తక్కువ పెన్షన్‌ను పొందుతోంది, ఇది మార్కెట్ యొక్క మార్పులపై ఆధారపడి ఉంటుంది కాబట్టి అందరికీ ”ఓపిఎస్‌ను పునరుద్ధరించడానికి జోక్యం చేసుకోవాలని మోదీని మెమోరాండం కోరింది.



‘పెన్షన్ హక్కుల మహా ర్యాలీ’లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆఫీసర్లు, ఉపాధ్యాయులు, మాజీ పారా మిలటరీ ఉద్యోగులు, పెన్షనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంలీలా మైదానంలో ఎన్.జె.సి.ఏ కన్వీనర్ శివగోపాల్ మిశ్రా అధ్యక్షతన బహిరంగసభ జరిపారు. జాయింట్ ఫోరం ఫర్ రెస్టోరేషన్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (జేఎఫ్ఆర్ఓపీఎస్) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరిగిన ప్రదర్శనలు, ర్యాలీలలో లక్షలాది మంది రైల్వే, డిఫెన్స్, పోస్టల్, ఇన్కమ్ టాక్స్ తదితర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆఫీసర్లు, రాష్ట్ర ప్రభుత్వ, స్వయంప్రతిపత్త సంస్థల ఉద్యోగులు, టీచర్లు, యూనివర్సిటీల సిబ్బంది, పెన్షనర్లు పాల్గొని న్యూ పెన్షన్ స్కీము(సిపియస్)ను రద్దు చేయాలని నినదించారు. ఎన్పీఎస్ కారణంగా ఉద్యోగుల భవిష్యత్తు అనిశ్చితంగా మారినందు వల్ల ఓపీఎస్‌ ను పునరుద్ధరించమనడం న్యాయబద్ధమైన కోర్కె తెలంగాణ ఆల్ పెన్షనర్స్ మరియు రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం అశోక్ ఈ సందర్భంగా తెలిపారు.


        సి.ఆర్.పి.ఎఫ్, సి.ఐ.ఎస్.ఎఫ్, ఐ.టి.బి.పి, యస్.యస్.బి, ఎన్.ఎస్.జి, అస్సాం రైఫిల్స్, తదితర సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సి.ఎ.పి.ఎఫ్ లు) సిబ్బంది అందరూ పాత పెన్షన్‌ స్కీముకు అర్హులని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వారికి కూడా ఓపీఎస్‌ అమలు చేయడానికి తిరస్కరించటం శోచనీయమని పేర్కొన్నారు. ఎన్.పీ.ఎస్ కు అనుకూలంగా కొద్దిమంది ఆర్థికవేత్తలు చేస్తున్న వాదనలు పూర్తిగా అసంబద్ధమన్నారు. అనేక దేశాల్లో పెన్షన్ నిధులు కుప్పకూలాయని, పెన్షనర్లు నష్టపోయారని, భారతదేశంలో కూడా ఎన్.పీ.ఎస్ మార్కెట్‌పై ఆధారపడి ఉంటుందని, షేర్ మార్కెట్ పతనమైతే పెన్షన్ ఫండ్ దివాళా తీస్తుందని గడ్డం అశోక్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రజాసంపదను కార్పొరేట్లకు దోచి పెడుతూ, సామాజిక రంగానికి, వృద్ధాప్య భద్రతపై కోతలు విధిస్తున్నదని, పెన్షన్ ఫండ్లను ప్రైవేటీకరిస్తున్నదని తెలిపారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించినట్లుగా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నో పెన్షన్ స్కీమును (ఎన్.పీ.ఎస్) రద్దు చేసి ఓ.పి.ఎస్ ను అమలు పరచాలని కోరారు. పాత పెన్షన్ విధానం ఉద్యోగులకే కాకుండా దేశానికి కూడా చాలా ఉపయోగకరమన్నారు. ఎన్. పీ.ఎస్ పై కేంద్రం వేసిన కమిటీపై భ్రమలు అవసరం లేదని, వృద్ధాప్య భద్రతను కాపాడేందుకు, దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఇతర సమస్యల పరిష్కారానికై ఐక్యంగా భారత్ బంద్ తో సహా ఆందోళనలను వెంటనే తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా గడ్డం అశోక్ హెచ్చరించారు.


గడ్డం అశోక్

9490300725






09/08/2023

Restoration of Old Pension Scheme: Burden on States? Truth!

G. Ashok

ఓపీఎస్‌ పునరుద్ధరణ: రాష్ట్రాలపై భారమా? నిజమెంత!    


        బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం నిర్ణయాన్ని ధిక్కరించి, నూతన పెన్షన్‌ స్కీమ్‌ను రద్దు చేసి తమ ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్ని తిరిగి అమలు చేస్తామని ప్రచారాన్ని మొదలుపెట్టాయి. న్యూ పెన్షన్‌ స్కీమ్‌కు వ్యతిరేకంగా అనేక పోరాటాలు ఊపందుకున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పెన్షన్‌ స్కీము నుండి పాత పెన్షన్‌ విధానానికి మారడానికి నిర్ణయాలు చేసి అమలు కూడా చేస్తున్నాయి. నూతన పెన్షన్‌ స్కీమ్‌ అంగీకారయోగ్యం కాదని, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధ రించాలని రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలోని బీజేపీయేతర పార్టీ ప్రభుత్వాలు నిర్ణయించుకున్నాయి. ఈ పార్టీలు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తామని, ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో వాగ్దానాలు చేసి ప్రస్తుతం అమలు కోసం ప్రకటించాయి. కేంద్రం మాత్రం నూతన పెన్షన్‌ విధానం అమలుకు తన నిబద్ధతను తెలియజేస్తూ పార్లమెంటులో ప్రకటించింది. పాత పెన్షన్‌ విధానానికి తిరిగి రివర్షన్‌కు ఎంచుకునే రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ధిక సంక్షోభానికి దారి తీస్తాయని కేంద్ర ప్రభుత్వ అనుకూల ఆర్ధిక వేత్తలు, అనుకూల ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రచారం చేస్తున్నవి. అంతేకాక, ఉద్యోగుల ఓట్లు సంపాదించుకోడానికి ఆయా పార్టీలు ఎంచుకున్న ఎత్తుగడగా కూడా అభివర్ణిస్తున్నవి.

పాత పెన్షన్‌ విధానం కింద సభ్యులుగా వున్నవారు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలకు చెందిన రెగ్యులర్‌ ఉద్యోగులు 2004కు ముందు సర్వీసులో వున్నప్పుడు ఎటువంటి తన వాటా షేర్‌ను చెల్లించకుండానే పదవీ విరమణ తదుపరి, చివరగా తీసుకున్న వేతనంలో సగానికి సగం పెన్షన్‌ పొందుతారు. దీనిని నిర్దిష్ట పెన్షన్‌ ప్రయోజన పథకం అంటారు. అంతేకాక, పదవీ విరమణ తదుపరి, ఆ కుటుంబానికి సామాజిక భద్రత కల్పిస్తుంది. పదవీ విరమణ తరువాత, ధరల పెరుగుదలకు అనుగుణంగా కరువు భత్యం రిలీఫ్‌ను, పెన్షన్‌పై నిష్పత్తిగా చెల్లి స్తారు. ఇదే విధంగా సర్వీసులో ఉన్నప్పుడు కూడా కరువు భత్యం పేరుతో మూల వేతనంపై నిష్పత్తిగా ఇస్తారు. ప్రజలకు సేవ అందించే ఉద్యోగులకు విరమణ తరువాత వారి సామాజిక భద్రతకు భరోసా ఇచ్చే అవసరమైన నిర్వచించబడిన నిర్దిష్టమైన ప్రయోజనం సమకూర్చు పథకం అని అర్ధం. నూతన పెన్షన్‌ బిల్లు పథకం రూపకల్పన అంటే, పథకం ప్రయోజనాలను అందించే సంస్థల పెన్షన్‌ బిల్లు, ఉద్యోగుల వేతనాల నుండి 10శాతం వాటా నిధులను ప్రభుత్వం తరపు నుంచి 14శాతం వాటా నిధులను సమకూరుస్తుంది.ఈ నూతన పెన్షన్‌ పథకాన్ని అమలుచేయుటకు అవసరమైన ఆర్ధిక వనరులను సమకూర్చుకోవడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత, భారతదేశంలోనే కాకుండా, అనేక ఇతర దేశాలలోనూ ఇలాంటి పథకాలు అమలులో వున్నాయి.

ప్రజలకు సేవలందించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా, ఇతర సంస్థలలో 20 లేదా అంతకంటే ఎక్కువ మంది. కార్మికులు పనిచేసే సంస్థలలో తప్పనిసరిగా పదవీ విరమణ పొదుపు పథకం వర్తిస్తుంది. అటువంటి సంస్థలలో ఉద్యోగి అతని లేక ఆమె జీతంలో 10 శాతం వాటాను ఈ పథకానికి అందించ వలసి వుంటుంది. ఈ పథకానికి యజమాని నుండి కూడా సహ కారం అందించబడుతుంది. ఈ సేకరించబడిన సొమ్ము మొత్తాన్ని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థచే నిర్వహించబడుతుంది. పదవీ విరమణ తరువాత, ఉద్యోగి ఏకమొత్తం చెల్లింపునకు అర్హులు. మిగిలిన భాగాన్ని యాన్యుటీ చెల్లింపు పథకాలలో పెట్టు బడి పెట్టగా వచ్చిన దానిని పెన్షన్‌గా చెల్లిస్తారు. అనేకమంది కార్మికులు చిన్న అనధికారిక, ప్రయివేటురంగ యూని ట్లలో లేదా స్వయం ఉపాధి పొందుతున్న చాలామంది. కార్మికులు కూడా ఈ పథకం నుండి దూరంగా వున్నా రంటే ఆశ్చర్యం కాదు. వారు ఇకపై పని చేయలేనప్పుడు, పొదుపు చేయడానికి. తగినంత సంపాదించలేని వారికి అందించడానికి అధికారిక సామాజిక రక్షణ పథకాలలో కొన్ని అధికారికంగా నిర్వచించబడిన దారిద్య్రరేఖకు దిగువన వున్న వారికి కంట్రిబ్యూషన్‌ లేకుండానే పెన్షన్‌ను చెల్లిస్తున్నారు. ఈ పథకంలో పెన్షన్‌ రూపంలో చెల్లించేది. చాలా అల్పమయినదే.

ప్రస్తుత వైరుధ్యం పాత పెన్షన్‌ పథకాన్ని తిరిగి అమలు గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే పథకాలకు సంబంధించినది. పాత పెన్షన్‌ పథకాన్ని రద్దుచేసి, నూతన పెన్షన్‌ పథకంతో భర్తీ చేయాలనే నిర్ణయం, పాత పెన్షన్‌ పథకం ఆర్ధికంగా నిలకడగా లేనందున సమర్ధించబడుతోంది అనే వాదన కూడా వుంది. ప్రభుత్వ ఉద్యోగుల జీవితకాలం పెరగడం, ధరల పెరుగుదల ఆధారంగా హామీ ఇవ్వబడిన కరువు భత్యంతో పెన్షన్‌లో పెరుగుదల ఫలితంగా, ప్రతి వ్యక్తి పెన్షన్‌ సొమ్ము పెరిగింది. కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెన్షన్‌ బిల్లులో పెరుగుదల ఏర్పడింది. మరొకవైపు ఆదాయాలు తగినంతగా పెరగడం లేదు. కారణం ఆర్ధికలోటు జిడిపిలో రుణాల స్థాయి పెరగకుండా ఉండాలంటే, సామాజికంగా వ్యయంతో (పెన్షన్‌ తదితర వ్యయాలు) సహా ఇతర వ్యయాలను తగ్గించవలసి వుంటుంది. ఈ వాదన రెండు స్పష్టమైన ప్రశ్నలకు దారితీస్తుంది. ముందుగా పెన్షన్‌ బిల్లులో పెరుగుదలకనుగుణంగా ఆదాయాలు ఎందుకు లేవు? రెండవది లోటు, రుణం స్థాయిని ఏది నిర్ణయిస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి భిన్నంగా వున్నాయి..

కేంద్రం విషయానికొస్తే, నయా ఉదారవాద విధానాల అమలు వల్ల ఆర్ధికంగా పతనం చెంది ఆదాయ వృద్ధి లేకుండా వుంది. ఇది అభివృద్ధికి దారి తీస్తుందని అంచనా వేసి ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహించబడానికి కేంద్ర ప్రభుత్వం అవలంభించిన పన్ను విధానమే! ఉదాహరణకు 2019-20లో లాభ దాయకమైన సంస్థలపై పన్ను రేటు కేవలం 22.5 శాతం ఉందని ఒక సర్వే చెబుతోంది. అయితే కేవలం రూ.10 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం వున్న కంపెనీలకు అవసరమైన చట్టబద్ధమైన రేటు (మినహాయింపులు, రాయితీలు లేకుండా) 34 శాతంగా వుంది. నయా ఉదారవాదం అంటే, ఆర్ధిక మూలధనాన్ని తగ్గించాల్సిన అవసరం వున్నందున, ద్రవ్య లోటును తప్పనిసరిగా పూడ్చాలి. ఈ లోటు, ఆర్ధిక వ్యయం రాష్ట్ర ప్రయోజనాలకు హాని కరంగా పరిగణిచింది. తద్వారా మొత్తం వ్యయం పెరుగుదలపై పరిమితిని నిర్దేశి స్తుంది. ఈ పరిమితి, పెన్షన్‌ బిల్లు పెరిగే రేటు కంటే తగ్గితే, పన్ను రాబడిని పెంచాలి. లేదా ఇతర ఖర్చులను తగ్గించవలసి వుంటుంది. ప్రయివేటు లాభదాయకతను ప్రోత్సహించే నయా ఉదారవాద నిబద్ధత కారణంగా పన్నురాబడిలో పెరుగుదల విస్మరించబడింది. కాబట్టి సర్దు బాటును నిర్ధారించడానికి, ఖర్చులను తగ్గించాల్సి వుంటుంది. కాని వారసత్వంగా వచ్చిన వ్యయకట్టుబాట్లను బట్టి ఆర్ధిక సంక్షోభ ఫలితంగా కేంద్రం స్వచ్ఛందంగా కార్పొరేట్‌ రంగానికి, పన్ను రాయితీలను అందించి, దాని ఆర్ధికలోటును నియంత్రించడానికి ఎంచుకున్నట్టే, 2004లో స్వచ్ఛందంగా, పాత పెన్షన్‌ విధానాన్ని ఉపసంహరణను ఎంచుకుంది.

నయా ఉదారవాదం, ఆర్ధికంగా రాష్ట్రాలు బలహీనపడటం, సంక్షోభానికి కారణమని వాస్తవ పరిస్థితి నుండి దష్టిని మరల్చడానికి పాత పెన్షన్‌ పథకాన్ని వదిలివేయబడుతున్న సంక్షోభానికి ప్రతిస్పందనగా, కేంద్ర ప్రభుత్వం మరియు నయా ఉదారవాదం న్యాయ నిర్ణేతలు నూతన పెన్షన్‌ పథకంను విజయ వంతమైన పరిష్కారంగా నిర్వచించారు. నూతన పెన్షన్‌ పథకం కింద 2004 తరువాత ఉద్యోగంలో నియమించబడిన ప్రభుత్వ ఉద్యోగులు తమ వేతనంలో 10శాతం వాటాను నిధికి విరాళంగా అందిస్తారు. ప్రభుత్వం 14శాతం వాటాను నిధికి సహకారాన్ని అందిస్తుంది. పేరుకుపోయిన మొత్తాలను స్వతంత్ర పెన్షన్‌ ఫండ్‌ మేనేజర్లు వారి సేవలకు చెల్లించే నిధులతో పెట్టుబడి పెడతారు, ఉద్యోగులు పదవీ విరమణ చేసినప్పుడు వారు కార్పస్‌ ఫండ్‌లో గరిష్టంగా 60శాతం మొత్తాన్ని తీసుకొని మిగిలిన మొత్తాన్ని యాన్యుటీ స్కీమ్‌లో పెట్టుబడి పెడతారు. దాని నుండి వచ్చే రాబడి నుండి పెన్షన్‌ చెల్లిస్తారు. ఈ పథకం ప్రభుత్వ ఉద్యోగులకు తప్పనిసరి, కాని ఇతర ప్రయివేటురంగ యజమానులు వారి ఉద్యోగులు కూడా ఈ పథకంలో చేరడానికి అర్హులు.

పెన్షన్‌ అందించే కార్పస్‌ ఫండ్‌ను రూపొందించడంలో ఉద్యోగి, సహకరిస్తున్నప్పటికీ, ప్రభుత్వం ఇప్పటికే వాటాను అందజేసే, వృత్తిపరమైన ఫండ్‌ మేనేజరుల ద్వారా ఆ నిధుల నిర్వహణ, ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలో తరువాత పొందిన మొత్తాలను సమీకరించింది. కానీ ఫండ్‌ మేనేజరు ద్వారా కార్పస్‌ ఫండ్‌ ఎంత బాగా నిర్వహించబడుతుందనే దానిపై పెన్షన్‌ చెల్లింపు ఆధారపడి వుంటుంది. 2008 ఆర్ధిక సంక్షోభం సమయంలో అమెరికన్‌ పెన్షనర్లకు జరిగినట్లుగా మార్కెట్‌ ఆశించిన రాబడిని అందించక పోవచ్చు లేదా కుప్పకూలడం సంభవించినప్పుడు పొదుపులో ఎక్కువ భాగాన్ని కూడా తుడిచివేయవచ్చు. అంతేకాకుండా, ఎలాంటి ఫలితం వచ్చినా రుసుమును స్వీకరించే ప్రొఫెషనల్‌ ఫండు మేనేజరు. ఊహించనంత తెలివిగా ఉండక పోవచ్చు. ఈ స్కీము గ్యారంటీ లేనిది. బెనిఫిట్‌ లేనిది. నిర్వచించబడిన సహకారం లేదు. ఈ నష్టాలు ముఖ్యమైనవి. ఇది పాత పెన్షన్‌ పథకం కంటే నూతన పెన్షన్‌ పథకం వలన చాలా తక్కువ ఫలితం ఉంటుంది. అని అనేక ఉదాహరణలను ఉటంకించవచ్చు.

ఉద్యోగులు, కార్మికులు పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరణకు చేసే ఉద్యమంతో పాటు కేంద్ర ప్రభుత్వం, వారి అనుకూల మీడియా వారి ఆర్ధికవేత్తలు చేసే తప్పుడు వాదనలో (అనగా పాత పెన్షన్‌ విధానం అమలు వల్ల ప్రభుత్వాలు అధిక ఆర్ధిక భారాలు మోస్తున్నవి అనే వాదనలు) ఎంత మాత్రం వాస్తవం లేదని ప్రచార యుద్ధాన్ని కూడా జతచేసి పోరాటం నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. అంతేగాక పాత పెన్షన్‌ పునరుద్ధరణ ఉద్యమంలో ఐక్యతను పటిష్టంగా నిర్మాణం చేసి దేశవ్యాపిత ఐక్య పోరాటాలకు కృషిచేయాలి. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో విడివిడిగా జరుగుతున్న పోరాటాలు దేశవ్యాప్త పోరాటాలుగా రూపాంతరం చెందే విధంగా కృషి చేసి విజయం సాధించేవరకూ పోరాడాలి. అదే కార్మికవర్గం ముందున్న ప్రస్తుత, ప్రధాన కర్తవ్యం కావాలి.


 
ఎస్‌ఎస్‌ఆర్‌ఎ ప్రసాద్‌ 
 9490300867



నవ తెలంగాణ, దినపత్రిక 09-08-2023 సౌజన్యంతో

02/08/2023

ITR Filling - Upto 200% Penality on Fake Receipts

G. Ashok

 
ఆదాయ పన్ను సరిగా చెల్లించకపోతె 200శాతం పెనాల్టీ.

గడ్డం అశోక్,

            ఆదాయపన్ను ఆక్ట్ నిబంధనల ప్రకారం పన్ను నిబంధనలన ప్రకారం చెల్లించకుండా తప్పించుకోవడానికి తప్పు పద్దతులను పాటించేవారిపై తీవ్రమైన చర్యలకు ఆదాయపన్ను శాఖ సిద్ధమవుతోంది. దానిలో భాగంగా చెల్లించని పన్ను పై 200శాతం దాకా పెనాల్టీ విధించడమే కాకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకునే ప్రమాదం కూడా ఉంటుంది. కొన్ని పరిస్థితులలో జైలు పాలయ్యే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆదాయపన్ను రిటర్నులు పూర్తి చేయడానికి విధించిన సమయం జులై 31 తో ముగిసినందున సమర్పించబడిన రిటర్నులను క్షున్నంగా పరిశీలించే పనిలో ఆదాయపన్ను శాఖ బిజీగా ఉంది.

        ఆదాయపన్ను చట్టం పన్ను మదింపు సమయంలో కొన్ని రాయితీలు కల్పించింది. ముఖ్యంగా ఇంటి అద్దె అలవెన్స్, వివిధ సంస్థలకు ఇచ్చిన విరాళాలు విషయాలలో రాయితీలు ఉన్నాయి. పన్ను మదింపు సమయంలో పన్ను చెల్లించేవారు ఫేక్ అద్దె రశీదులు సమర్పించి పన్ను రాయితీని పొందుతున్నారు. వివిధ సంస్థలకు విరాళాల రూపంలో ఇచ్చిన అని చెబుతున్న రశీదులను సమర్పించమని నోటీసులు పంపడానికి సిద్దమవుతున్నారు. రశీదులు సమర్పించకున్నా, సమర్పించిన రశీదులు నఖిలీవని తెలిసినా సెక్షన్ 270ఏ ప్రకారం 200శాతం దాకా పెనాల్టీ (అపరాధ రుసుము) విధించే అవకాశం ఉంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో చట్ట ప్రకారం విచారణ కూడా ఎదుర్కోవలసి ఉంటుందనీ, జైలు శిక్ష కూడా పడే ప్రమాదం ఉంటుందని దివాకర్ విజయసారథి, ఢివిఎస్ అద్వైజర్స్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి దివాకర్ విజయసారథి తెలిపారు.