02/08/2023

ITR Filling - Upto 200% Penality on Fake Receipts

 
ఆదాయ పన్ను సరిగా చెల్లించకపోతె 200శాతం పెనాల్టీ.

గడ్డం అశోక్,

            ఆదాయపన్ను ఆక్ట్ నిబంధనల ప్రకారం పన్ను నిబంధనలన ప్రకారం చెల్లించకుండా తప్పించుకోవడానికి తప్పు పద్దతులను పాటించేవారిపై తీవ్రమైన చర్యలకు ఆదాయపన్ను శాఖ సిద్ధమవుతోంది. దానిలో భాగంగా చెల్లించని పన్ను పై 200శాతం దాకా పెనాల్టీ విధించడమే కాకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకునే ప్రమాదం కూడా ఉంటుంది. కొన్ని పరిస్థితులలో జైలు పాలయ్యే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆదాయపన్ను రిటర్నులు పూర్తి చేయడానికి విధించిన సమయం జులై 31 తో ముగిసినందున సమర్పించబడిన రిటర్నులను క్షున్నంగా పరిశీలించే పనిలో ఆదాయపన్ను శాఖ బిజీగా ఉంది.

        ఆదాయపన్ను చట్టం పన్ను మదింపు సమయంలో కొన్ని రాయితీలు కల్పించింది. ముఖ్యంగా ఇంటి అద్దె అలవెన్స్, వివిధ సంస్థలకు ఇచ్చిన విరాళాలు విషయాలలో రాయితీలు ఉన్నాయి. పన్ను మదింపు సమయంలో పన్ను చెల్లించేవారు ఫేక్ అద్దె రశీదులు సమర్పించి పన్ను రాయితీని పొందుతున్నారు. వివిధ సంస్థలకు విరాళాల రూపంలో ఇచ్చిన అని చెబుతున్న రశీదులను సమర్పించమని నోటీసులు పంపడానికి సిద్దమవుతున్నారు. రశీదులు సమర్పించకున్నా, సమర్పించిన రశీదులు నఖిలీవని తెలిసినా సెక్షన్ 270ఏ ప్రకారం 200శాతం దాకా పెనాల్టీ (అపరాధ రుసుము) విధించే అవకాశం ఉంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో చట్ట ప్రకారం విచారణ కూడా ఎదుర్కోవలసి ఉంటుందనీ, జైలు శిక్ష కూడా పడే ప్రమాదం ఉంటుందని దివాకర్ విజయసారథి, ఢివిఎస్ అద్వైజర్స్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి దివాకర్ విజయసారథి తెలిపారు.  


 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి